Tollywood : ప్రముఖ నటి ఆత్మహత్య…కారణం ఇదే…

Tollywood  : తాజాగా సినీ ఇండస్ట్రీలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. వినోద రంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ రాణిస్తున్న వర్తమాన తార ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఆమె మరణ వార్త సినీ వర్గాలలోని ప్రముఖులకు అభిమానులకు శ్రేయోభిలాషు కు స్నేహితులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అయితే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన […]

  • Published On:
Tollywood : ప్రముఖ నటి ఆత్మహత్య…కారణం ఇదే…

Tollywood  : తాజాగా సినీ ఇండస్ట్రీలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. వినోద రంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ రాణిస్తున్న వర్తమాన తార ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఆమె మరణ వార్త సినీ వర్గాలలోని ప్రముఖులకు అభిమానులకు శ్రేయోభిలాషు కు స్నేహితులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అయితే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన రెంజూష మీనన్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న నటి. అయితే తాజాగా ఆమె తన నివాసంలో ఉరివేసుకుని మరణించారు . ఇక రెంజూష మరణం పై ఆమె భర్త మనోజ్ కూడా స్పందించారు.

popular-actress-committed-suicide-this-is-the-reason

అయితే ఆమె మరణానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా తెలియవు కానీ , మీడియా వర్గాలు అందిస్తున్న కథనం ప్రకారం ఆమె మరణానికి ఆర్థిక సమస్యలు కారణమని తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి ఆర్థిక సమస్యలే కారణమా లేక మరేమైనా ఉన్నాయా అనే విషయాలను కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొచ్చిన్ కు చెందిన రెంజూష మీనన్ టెలివిజన్ షోల ద్వారా వినోద రంగంలోకి అడుగుపెట్టారు. అలా టీవీ సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకొని మంచి పేరు తెచ్చుకున్నారు.

popular-actress-committed-suicide-this-is-the-reason

ఈ క్రమంలోనే ఒక వైపు సీరియల్స్ లో నటిస్తు సినిమాల్లో కూడా అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే సిటీ ఆఫ్ గాడ్ నెరుకుందొరు గుంజాడు బాంబే మార్చ్ , వన్ వే టికెట్ వంటి సినిమాలలో నటించి మెప్పించారు. , ఇక ఆమె చేసిన పాత్రలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల మలయాళ పరిశ్రమలో సూసైడ్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మలయాల పరిశ్రమకు చెందిన అపర్ణా నాయర్ ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే.