Revanth Reddy : కార్యకర్తలను మళ్లీ కొట్టిన రేవంత్ రెడ్డి…అభిమాని వీపుపై పిడుగుద్దులు..వైరల్ వీడియో…

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రతి పార్టీ ప్రచారాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రచారాలలో కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బిజెపి నాయకులు కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ […]

  • Published On:
Revanth Reddy : కార్యకర్తలను మళ్లీ కొట్టిన రేవంత్ రెడ్డి…అభిమాని వీపుపై పిడుగుద్దులు..వైరల్ వీడియో…

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రతి పార్టీ ప్రచారాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రచారాలలో కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బిజెపి నాయకులు కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ ప్రియాంక గాంధీ లతోపాటు కర్ణాటక సీఎంని కూడా బరిలోకి దించాయి. ఇక బిజెపి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని రంగంలోకి దింపింది. ఇది ఇలా కొనసాగుతుండగా కాంగ్రెస్ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేసిఆర్ కు దీటుగా ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ప్రచార సభలో నిర్వహిస్తున్నారు.

revanth-reddy-viral-video

ఈ క్రమంలో ఆయన కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ ను కలవరపెడుతుందని చెప్పాలి. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ కార్యకర్తలు అభిమానులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రచార సభల్లో తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు మరియు అభిమానులపై రేవంత్ రెడ్డి చేయి, కాలు చేసుకుంటున్నారు. మొన్న కొడంగల్ లో నామినేషన్ సందర్భంగా వచ్చిన కార్యకర్తలలో ఒకరిని రేవంత్ రెడ్డి కాలితో తన్నిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి అదే పని చేశాడు.

రామగుండంలో నిర్వహించిన ప్రచార సభలో హాజరైన రేవంత్ రెడ్డి తన పాదాభివందనాలు తీసుకునేందుకు వచ్చిన అభిమాని వీపుపై పిడుగుద్దులు గుద్దాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందర్నీ కలుపుకొని పోవాల్సిన నాయకుడు తన సొంత కార్యకర్తలపై అభిమానులపై ఇలా చేయి చేసుకోవడం తీవ్ర చర్చానియాంశంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ కు ప్రజలలో ప్రజాధరన పెరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి ఇలా చేయడం కలవర పెడుతుంది. అలాగే రేవంత్ రెడ్డి చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు. సమయాభావంతో అభిమానులను కలవడం వీలు కాదని చెప్పాలి కానీ దానికి విరుద్ధంగా ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.