CM Revanth Reddy : 500 కి గ్యాస్ సిలిండర్ అప్లై చేయాల్సిన పనిలేదు…

CM Revanth Reddy  :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలవేళ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే రెండు పథకాలను అమలులోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆరు గ్యారెంటీ లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. ప్రస్తుతం మిగతా పథకాల మార్గదర్శకాలను […]

  • Published On:
CM Revanth Reddy : 500 కి గ్యాస్ సిలిండర్ అప్లై చేయాల్సిన పనిలేదు…

CM Revanth Reddy  :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలవేళ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే రెండు పథకాలను అమలులోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆరు గ్యారెంటీ లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. ప్రస్తుతం మిగతా పథకాల మార్గదర్శకాలను ప్రవేశపెట్టే పనిలో ఉంది ప్రభుత్వం. దీనిలోనే భాగంగా 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాలు అమలుకై తాజా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా 500 వంటగ్యాస్ సిలిండర్ ఆ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉంది

. 500 కి గ్యాస్ సిలిండర్ అర్హులకు ఎంపిక చేయడం కోసం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు ఆశా కార్యకర్తల ద్వారా పరిశీలించనున్నారు. తర్వాత అర్హులనే వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్ లో చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను తీసుకువెళ్లి రేషన్ కార్డ్ ఎల్పిజి కంపెనీ పేరు వినియోధారిని నెంబర్ పాస్ బుక్ నెంబర్, డెలివరీ రసీదు నెంబర్ వంటి వివరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వారు 500 గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులు అని భావిస్తే వారికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఎల్పిజి కంపెనీ పేరు వినియోగదారుల సంఖ్య వంటివి యాప్ లో నమోదు చేస్తారు.

అంగన్వాడి ఆశ వర్కర్లు గ్రామస్తులు పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం తో అర్హుల ఎంపికను వారికి అప్పగించింది. ఇక సర్కార్ ఓకే అన్నవారే ఈ పథకనికి అర్హులు అవుతారు. 500 కి గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులయ్యేవారు వారి వివరాల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ని అన్ని జిల్లాలకి పంపించమన్నారు. గ్రామస్థాయిలో పంచాయితీ కార్యదర్శుల మండల స్థాయిలో ఎంపీటీసిలు, ఎమ్మార్వోలు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ యాప్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ కార్యదర్శి వివరాలు జిహెచ్ అండ్ కమిషనర్ వారు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారు. అంతేకాక ఇటీవల తెలంగాణ క్యాబినెట్ 200 యూనిట్ల ఉచిత కరెంట్ విద్యుత్ అందించేందుకు తీసుకువచ్చిన గృహ జ్యోతి పథకానికి కూడా ఆమోదం తెలిపింది.