Biryani : కేవలం రూ.10 లకే వెజ్ బిర్యానీ .. ఎగబడుతున్న జనం ..

Biryani : ప్రస్తుత కాలంలో బిర్యానీని ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం పట్టణాలలోనే కాదు పల్లెటూర్లలో కూడా బిర్యానీ సెంటర్లు వెలిశాయి. ఎక్కడ చూసినా అడుగడుగున బిర్యాని సెంటర్లు కనిపిస్తున్నాయి. బిర్యానీ తినేవాళ్లు ఎక్కువ అవుతుండడంతో వీటి డిమాండ్ కూడా పెరుగుతూ పోతుంది. ఒకప్పుడు కేవలం చికెన్ బిర్యాని మాత్రమే ఉండేది. ఇప్పుడైతే రకరకాల బిర్యానిలు వచ్చేసాయి. వేజ్ బిర్యానీ,చికెన్ బిర్యాని, మటన్ […]

  • Published On:
Biryani : కేవలం రూ.10 లకే వెజ్ బిర్యానీ .. ఎగబడుతున్న జనం ..

Biryani : ప్రస్తుత కాలంలో బిర్యానీని ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం పట్టణాలలోనే కాదు పల్లెటూర్లలో కూడా బిర్యానీ సెంటర్లు వెలిశాయి. ఎక్కడ చూసినా అడుగడుగున బిర్యాని సెంటర్లు కనిపిస్తున్నాయి. బిర్యానీ తినేవాళ్లు ఎక్కువ అవుతుండడంతో వీటి డిమాండ్ కూడా పెరుగుతూ పోతుంది. ఒకప్పుడు కేవలం చికెన్ బిర్యాని మాత్రమే ఉండేది. ఇప్పుడైతే రకరకాల బిర్యానిలు వచ్చేసాయి.

వేజ్ బిర్యానీ,చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఇలా వివిధ రకాల బిర్యానీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రజలు కూడా వీటిని తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ధర కొద్దిగా ఎక్కువైనా సామాన్య ప్రజలు కూడా బిర్యానీ రుచులను ఆస్వాదిస్తున్నారు. బిర్యానీ కనీస ధర 70 నుంచి 100 కి పైనే ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి వెజ్ బిర్యానీనీ కేవలం 10 రూపాయలకే అమ్ముతున్నాడు. దీంతో జనాలు 10 రూపాయలే అని ఎగబడి కొంటున్నారు.

అసలు వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్ కు చెందిన మహేష్ అనే వ్యక్తి గాజులరామారాం డివిజన్ దేవేంద్ర నగర్ లో కేవలం పది రూపాయలకే వెజ్ బిర్యానీ అందిస్తున్నాడు. అంతకుముందు అంబర్ పేట లో బిర్యాని సెంటర్ నడిపే వాడినని తెలిపాడు. అక్కడిది తన కుటుంబ సభ్యులకు అప్పగించి దేవేంద్ర నగర్ లో బిర్యాని సెంటర్ పెట్టానని తెలిపారు. వచ్చే కొద్ది పాటి లాభాలతో కుటుంబాన్ని పోషిస్తున్నానని మహేష్ తెలిపారు. ప్రతిరోజు 70 నుంచి 100 ప్లేట్ల వరకు బిర్యానీని అమ్ముతున్నాడు. అటుగా వెళుతున్న వాహనదారులు పది రూపాయలకే వెజ్ బిర్యానీ బోర్డు చూసి తృప్తిగా తినేసి పోతున్నారు.

Must Read : Upasana konidela : ఉపాసన కొణిదెల డెలివరీ డేట్ ప్రకటించిన చిరంజీవి ..