Bigg Boss : బిగ్ బాస్ బయట ఫ్యాన్స్ రచ్చ. అభిమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు…

Bigg Boss  : హైదరాబాద్ లో బిగ్ బాస్ అభిమానులు రచ్చ చేశారు. దీంతో నిన్న దీనిపై చాలా కేసులో నమోదయ్యాయి. అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. బిగ్ బాస్ షో విన్నర్ ప్రకటన తర్వాత నడిరోడ్డుపై హంగామా చేశారు. ఆర్టీసీ బస్సుతోపాటు పలువురు కార్లను రాళ్లతో ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకోవడమే కాకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కార్లపై రాళ్లతో దాడి చేశారు. […]

  • Published On:
Bigg Boss  : బిగ్ బాస్  బయట ఫ్యాన్స్ రచ్చ.  అభిమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు…

Bigg Boss  : హైదరాబాద్ లో బిగ్ బాస్ అభిమానులు రచ్చ చేశారు. దీంతో నిన్న దీనిపై చాలా కేసులో నమోదయ్యాయి. అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. బిగ్ బాస్ షో విన్నర్ ప్రకటన తర్వాత నడిరోడ్డుపై హంగామా చేశారు. ఆర్టీసీ బస్సుతోపాటు పలువురు కార్లను రాళ్లతో ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకోవడమే కాకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కార్లపై రాళ్లతో దాడి చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ ఫ్యాన్స్ రచ్చపై పోలీసులు సీరియస్ అయ్యారు.

ఈ నేపధ్యంలోనే ఫ్యాన్స్ అందరి పై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అయితే కేవలం బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కూడా రచ్చ రచ్చ చేశారు. హౌస్ లో కంటెస్టెంట్స్ కొట్టుకుంటే హౌస్ బయట వాళ్ల ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ రచ్చ చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ ఫ్యాన్స్. అయితే ఈ ఘటన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగింది. దీంతో ఈ రచ్చ ఒక్కసారిగా కలకలానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు పిడుగులు గుద్దుకుంటూ బూతులు లతో రెచ్చిపోయాయి రెండు వర్గాలు పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ఫ్యాన్స్ పరస్పరం కొట్టుకోవడమే కాదు వాళ్లని వాళ్లు దాడి చేసుకోవడమే కాదు అటు గా వెళ్లే వాహనాలపై కూడా దాడికి దిగారు. దీంతో బిగ్ బాస్ ఫాన్స్ దాడిలో ఒక ఆర్టీసీ బస్సులు మరియు పలువాహనాలు ధ్వంసం అయ్యాయి.

వీళ్ళని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ అండ్ అమర్ దీప్ ఫాన్స్ పై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ నీ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ గెలుచుకున్న విషయం తెలిసిందే. రన్నర్ అప్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ నిలిచాడు. అయితే రన్నర్ అప్ గెలిచిన అమరదీప్ కార్ పై మొదటగా దాడి జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ మధ్య జరిగిన కొన్ని గొడవల వల్లనే ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ రాత్రి పది గంటల వరకు కనిపిస్తే ఆ తరువాత అర్ధరాత్రి వరకు ఫ్యాన్స్ కొట్లాట వైరల్ గా మారింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.