Mahi V Raghav : రాయలసీమ ని టాలీవుడ్ లో ఒక్కడు కూడా పట్టించుకోలేదు…

Mahi V Raghav  : దర్శకుడు మహి విరాగన్ మంచి సినిమాలు సిరీస్ చేస్తున్నారు. గతంలో వైయస్ ఆర్ బయోపిక్ గా యాత్ర సినిమాతో రాగా వైఎస్ జగన్ బయోపిక్ గా యాత్ర 2 సినిమా చేశారు. తండ్రి కొడుకు ఎమోషనల్ డ్రామా తో తెరకెక్కిన చిత్రం యాత్ర 2 ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా అనంతరం మహి రాఘవకి స్టూడియో కట్టడం కోసం మదనపల్లిలో స్థలం ఇచ్చారు అంటూ పలు విమర్శలు వచ్చాయి. యాత్ర […]

  • Published On:
Mahi V Raghav : రాయలసీమ ని టాలీవుడ్ లో ఒక్కడు కూడా పట్టించుకోలేదు…

Mahi V Raghav  : దర్శకుడు మహి విరాగన్ మంచి సినిమాలు సిరీస్ చేస్తున్నారు. గతంలో వైయస్ ఆర్ బయోపిక్ గా యాత్ర సినిమాతో రాగా వైఎస్ జగన్ బయోపిక్ గా యాత్ర 2 సినిమా చేశారు. తండ్రి కొడుకు ఎమోషనల్ డ్రామా తో తెరకెక్కిన చిత్రం యాత్ర 2 ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా అనంతరం మహి రాఘవకి స్టూడియో కట్టడం కోసం మదనపల్లిలో స్థలం ఇచ్చారు అంటూ పలు విమర్శలు వచ్చాయి. యాత్ర సినిమా తీసి ఎందుకు ఇలా ఇస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అయితే తాజాగా మహి రాఘవన్ విలేకరులతో మాట్లాడుతూ విమర్శలకు సమాధానం ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహీ రాగవన్ మాట్లాడుతూ… సిని ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది. నాది రాయలసీమ నా ప్రాంత అభివృద్ధి కోసం ఒక మినీ స్టూడియో కట్టాలి అనుకుంటున్నాను. నా ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అని ఆశ లేకపోతే నేను హైదరాబాద్ లోనే వైజాగ్ లోను స్టూడియో కట్టుకోవడానికి స్థలం కావాలి అని అడుగుతాను.

కానీ మదనపల్లిలో స్టూడియో ఎందుకు కట్టాలి అనుకుంటాను. నేను మదనపల్లిలోనే పుట్టాను అక్కడే చదువుకున్నాను. సినీ పరిశ్రమలు రాయలసీమలో షూటింగ్ చేయడానికి అంత ఆసక్తి చూపించరు. నా ప్రాజెక్టు పాఠశాల యాత్ర ముగిసిన తర్వాత సుద్దాలకో సైతాన్ వెబ్ సిరీస్ లోనే షూటింగ్ చేశాను. దాదాపు ఈ సినిమాకి 20 నుంచి 25 కోట్లు దాకా ఖర్చు చేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలి అని ఉద్దేశంతో నేను అక్కడ స్టూడియో కట్టాలి అనుకుంటున్నా. మదనపల్లిలో సినిమాలు చేయడం ద్వారా లాడ్జిలు హోటల్స్ పలు రకాల ఉపయోగాలు ఉంటాయి.నేను స్టూడియో నిర్మాణం కోసం 50 ,100 ఎకరాలు ఏమీ అడగలేదు. కేవలం రెండు ఎకరాలలో మినీ స్టూడియో ఏర్పాటు చేయాలి అనుకున్నాను. రాయలసీమకు ఎవరైనా ఏదైనా చేశారా మీరు చెయ్యరు చేసే వాళ్ళని చేయనివ్వరు. ఆ ప్రాంతంలో కేవలం ప్రజలకు ఉపయోగపడేవి ఇవ్వడం కోసం మినీ స్టూడియోను కట్టాలి అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.