Viral News : చెల్లి చేసిన పనికి బతికుండగానే దహన సంస్కారాలు చేసిన అన్న….ఇలాంటి ఘటన మునుపెన్నడూ చూసి ఉండరు..

Viral News : ఓ పేద కుటుంబానికి సంబంధించిన కథ ఇది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా కూడా ఇద్దరు కూతుళ్లను మరియు కొడుకును బాగా చదివించారు. తాము కష్టపడుతూ పిల్లలకు అన్ని సౌకర్యాలను సమకూర్చారు. పిల్లలు కూడా అనుకున్నట్లే బాగా చదువుకున్నారు. కానీ ఇంతలో ఊహించని రీతిలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక కూతురు తీసుకున్న నిర్ణయం వారి కుటుంబ సభ్యులకు ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. మా పరువు తీస్తుందా అంటూ చెల్లెలు దిష్టిబొమ్మను […]

  • Published On:
Viral News : చెల్లి చేసిన పనికి బతికుండగానే దహన సంస్కారాలు చేసిన అన్న….ఇలాంటి ఘటన మునుపెన్నడూ చూసి ఉండరు..

Viral News : ఓ పేద కుటుంబానికి సంబంధించిన కథ ఇది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా కూడా ఇద్దరు కూతుళ్లను మరియు కొడుకును బాగా చదివించారు. తాము కష్టపడుతూ పిల్లలకు అన్ని సౌకర్యాలను సమకూర్చారు. పిల్లలు కూడా అనుకున్నట్లే బాగా చదువుకున్నారు. కానీ ఇంతలో ఊహించని రీతిలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక కూతురు తీసుకున్న నిర్ణయం వారి కుటుంబ సభ్యులకు ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. మా పరువు తీస్తుందా అంటూ చెల్లెలు దిష్టిబొమ్మను పాడే పై పడుకోబెట్టి దహన సంస్కారాలు చేశాడు. దీంతో ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకెళితే..

sister-who-got-love-married-his-brother-performed-last-rites

అయితే ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ లో పూర్ణియ ప్రాంతం పరిధికి చెందిన కిషోర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య కొడుకు ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలలో ప్రియాంక అనే యువతి ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తన తండ్రి కిషోర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా కూడా పిల్లలు మాత్రం బాగా చదివించుకున్నాడు. అయితే తన కూతురు ఇలా చేస్తుందని మాత్రం అతను ఊహించలేకపోయాడు. అయితే ఇటీవల డిగ్రీ పాసైన ప్రియాంక…జూన్ 27న మార్క్ షీట్ తెచ్చుకునేందుకు కాలేజీకి వెళ్ళింది. పొద్దున కాలేజీకి వెళ్లిన ప్రియాంక సాయంత్రం అయినా కూడా ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు విచారణ మొదలుపెట్టారు. అయినా కూడా ఆమెజాడ దొరకలేదు. అయితే ప్రియాంక స్నేహితులు అందించిన సమాచారం లో మనోజ్ అనే యువకుడు పేరు బయటికి వచ్చింది.

sister-who-got-love-married-his-brother-performed-last-rites

దీంతో చేసేదేం లేక ప్రియాంక సోదరుడు ప్రశాంత్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. తన చెల్లిని మనోజ్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు ఆరోపించి పోలీస్ కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మనోజ్ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచారు. దీంతో చివరికి ప్రియాంక ఫోన్ చేసి మనోజ్ ను నేను ప్రేమిస్తున్నానని చెప్పింది. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని తన ఇష్ట పూర్వకంగానే మనోజ్ తో వెళ్లానని ప్రియాంక చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. తన చెల్లి ఇలా చేయడం చూసిన ప్రశాంత్ కి కోపం కట్టలు తెంచుకుంది. రాత్రి పగలు కష్టపడి చదివిస్తే…ఇంట్లో చెప్పకుండా ఇలా చేస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన చెల్లి ప్రియాంక చనిపోయిందంటూ దిష్టిబొమ్మను తయారుచేసి పాడేన్ సిద్ధం చేశాడు. ఆమెకు సంబంధించిన ఏ వస్తువును ఇంట్లో ఉంచకుండా దహనం చేశాడు. దీంతో ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.