Viral news :కృష్ణ నది లో ప్రత్యక్షమైన అయోధ్య రాముడు…

Viral news  : సాధారణంగా హిందువులకి దేవతల పురాతనమైన విగ్రహాలు అంటే చాలా మక్కువ ఎక్కువ. అలాంటి విగ్రహాలే తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కృష్ణా నదిలో అనేకసార్లు బయటపడ్డాయి. ఈ విగ్రహాలు వేటకు వెళ్లిన మత్స్యకారుల కీ దొరకడంతో వారు వారిని బయట పెట్టేవారు. ఇప్పటికే పది సార్లు నాగదేవత విగ్రహాలు, శివలింగాలు, విష్ణుమూర్తి, నంది , ఇలా సుమారు 11 రకాల రాతి విగ్రహాలను గుర్తించడంతో ఆ విగ్రహాలు బయటపడేది.ఇక ఈ విగ్రహాలను చూడడానికి […]

  • Published On:
Viral news :కృష్ణ నది లో ప్రత్యక్షమైన అయోధ్య రాముడు…

Viral news  : సాధారణంగా హిందువులకి దేవతల పురాతనమైన విగ్రహాలు అంటే చాలా మక్కువ ఎక్కువ. అలాంటి విగ్రహాలే తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కృష్ణా నదిలో అనేకసార్లు బయటపడ్డాయి. ఈ విగ్రహాలు వేటకు వెళ్లిన మత్స్యకారుల కీ దొరకడంతో వారు వారిని బయట పెట్టేవారు. ఇప్పటికే పది సార్లు నాగదేవత విగ్రహాలు, శివలింగాలు, విష్ణుమూర్తి, నంది , ఇలా సుమారు 11 రకాల రాతి విగ్రహాలను గుర్తించడంతో ఆ విగ్రహాలు బయటపడేది.ఇక ఈ విగ్రహాలను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు.అయితే తాజాగా ఇలాంటి సంఘటన తెలంగాణలో కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదిలో జరిగింది.అక్కడ వంతెన పనులు జరుగుతున్న సందర్భంగా సాక్షాత్తు ఆ దేవత మూర్తి విగ్రహం బయటపడింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదికి సంబంధించి వంతెన నిర్మాణ పనులు జరుగుచున్నవి. ఈ క్రమంలోనే మంగళవారం వంతెన పనులు చేస్తుండగా నదిలో కొన్ని విగ్రహాలు దర్శనమిచ్చాయి. వాటిని అలా తవ్వుతుండగా సాక్షాత్తు మహా విష్ణు మూర్తి నిలువెత్తు విగ్రహం, ఒక శివలింగం దర్శనమిచ్చింది.

దీనిని అధికారుల ఆదేశాలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి విగ్రహాలకు ఎటువంటి దెబ్బ తగలకుండా బయటికి తీశారు. వాటిలో శ్రీమహావిష్ణువు విగ్రహం పరిశీలించగా అది ఇటీవల అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన రాములల్ల విగ్రహముల ఉంది. పైగా ఆ విగ్రహాలు శతాబ్దాలకు పైగా చెందినవిగా కనిపిస్తున్నాయి.అయితే ముఖ్యంగా శ్రీమహావిష్ణువు నాలుగు చేతులు నిండిన ఆకారంతో ప్రత్యేకంగా కనిపించింది. అలాగే పై చేతిలో శంకు చక్రాలు మరో రెండు చేతుల్లో కటి హస్త ,వర్త హస్త ఉన్నాయి . విష్ణువు చుట్టూ మచ్చా,కూర్మా ,వరాహ, నరసింహ, వామనా, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు ,కల్కి, వంటి దశ అవతారాలు కలిగి ఉన్న ఇది అచ్చం వెంకటేశ్వర స్వామి పోలిక మరింత ఆకర్షణీయంగా ఉంది.అయితే విష్ణు విగ్రహం లో ఉండే గరుడు ఈ విగ్రహం లో లేకపోవడం విశేషం. ఈ విగ్రహం పై పూలమాలలు కూడా ఉంచడం విశేషం. అయితే ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాప్తించింది. అలాగే చాలామంది ప్రజలు విగ్రహాన్ని చూడడానికి చాలా ఆసక్తికరపరుస్తున్నారు.