Prabhas : అయోధ్య భోజనాలకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…

Prabhas : ప్రభాస్ అంటే ఈరోజు మన దేశం మొత్తం పీక కోసుకునే అంత పిచ్చి ఫాలోయింగ్ వచ్చేసింది. బాహుబలి సినిమా నుంచి మొన్న డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 సినిమా వరకు ప్రభాస్ సినిమా వస్తుందంటే అభిమానులు అద్భుతంగా ఎదురుచూశారు. ఇప్పటికీ కూడా ప్రభాస్ క్రేజ్ రవ్వంత కూడా తగ్గడం లేదు. అటువంటి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ పేరుతో లింక్ అయినా ఏ వార్త అయిన సోషల్ […]

  • Published On:
Prabhas : అయోధ్య భోజనాలకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…

Prabhas : ప్రభాస్ అంటే ఈరోజు మన దేశం మొత్తం పీక కోసుకునే అంత పిచ్చి ఫాలోయింగ్ వచ్చేసింది. బాహుబలి సినిమా నుంచి మొన్న డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 సినిమా వరకు ప్రభాస్ సినిమా వస్తుందంటే అభిమానులు అద్భుతంగా ఎదురుచూశారు. ఇప్పటికీ కూడా ప్రభాస్ క్రేజ్ రవ్వంత కూడా తగ్గడం లేదు. అటువంటి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ పేరుతో లింక్ అయినా ఏ వార్త అయిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి.ఇక అది నిజమో కాదో అనే ఆలోచన కూడా చేయారు.

అయితే ఇప్పుడు అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త జనవరి 22న జరుగుతున్న అయోధ్య రామ మందిరంలో రామ ప్రాణ ప్రతిష్ట విరాళంకు ప్రభాస్ ను ట్యాగ్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వార్తకు చాలా పోస్ట్ లు, లైకులు వచ్చాయి.ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఈ వార్తలే ప్రభాస్ ను అభినందిస్తూ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలు ఏంటంటే తాజాగా ప్రభాస్ 50 వేల కోట్లు విరాళం ఇచ్చారట.ఎందుకు అంటే అయోధ్యలో ఈనెల 22న జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నాడు భోజనాలు నిమిత్తం జరగబోయే ఖర్చు మొత్తాన్ని ప్రభాస్ ఒప్పుకున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రభాస్ కు సంబంధించిన వార్తగా ఈ కంటెంట్ హెడ్ లైన్స్ లోకి వెళ్ళింది.

prabhas-donation-for-ayodhya-rammandir

ప్రభాస్ ఆ రోజున అయోధ్య రామాలయానికి 50 కోట్ల ఖర్చు పెట్టడం ఏమంత భారం కాదు కానీ ఆ వార్త నిజమా కాదా అనేది పక్కన పెడితే అభిమానుల ఊహాగానాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. పైగా ఇది దాదాపు నమ్మకంగానే అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యనే ప్రభాస్ రాముల వారి పాత్రను కూడా ఆది పురుష్ సినిమాలో చేయడంతో లోతైన విశ్వానీయత కలిగింది. అయితే తాజాగా ప్రభాస్ టీం లో ముఖ్యమైన వ్యక్తిని ఆండ్రాయిడ్ పోస్టు వెబ్సైట్ ప్రతినిధిని సంప్రదిస్తే పక్క సమాచారం అందించారు. ఆయన మాట్లాడుతూ… అటువంటిది ఏమీ లేదని అసలు ప్రభాస్ కు ఆ విషయమే తెలియదని దీనికి సంబంధించిన సమాచారం ఏటువంటిది నడవలేదని ఆయన వివరించారు. ప్రభాస్ 50 కోట్ల విరాళం అనేది పూర్తిగా ఫేక్ న్యూస్ ఆయన తెలియజేశారు.