Viral Video : అక్క పిల్లల కోసం అక్క భర్తను పెళ్లి చేసుకున్న యువతి…చివరికి ఏం జరిగిందంటే…

Viral Video  : పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో జరుగుతాయని పెద్దలు చెప్తుంటారు. ఇక ఈ వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి . అందుకే వివాహ వేడుకలను కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పెళ్లి చేసుకుని ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉండే ఈ బంధాన్ని జీవితకాలం మర్చిపోకుండా గుర్తుంచుకునేలా మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఎంతో గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లి చేసుకున్న జంటలన్నీ కలిసి […]

  • Published On:
Viral Video : అక్క పిల్లల కోసం అక్క భర్తను పెళ్లి చేసుకున్న యువతి…చివరికి ఏం జరిగిందంటే…

Viral Video  : పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో జరుగుతాయని పెద్దలు చెప్తుంటారు. ఇక ఈ వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి . అందుకే వివాహ వేడుకలను కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పెళ్లి చేసుకుని ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉండే ఈ బంధాన్ని జీవితకాలం మర్చిపోకుండా గుర్తుంచుకునేలా మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఎంతో గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లి చేసుకున్న జంటలన్నీ కలిసి ఉండటం అంటే కష్టమని చెప్పాలి. చాలామంది అభిప్రాయ బేధాలతో విడిపోతుంటే మరికొందరు శాశ్వతంగా దూరమవుతున్నారు. ఇలా ఇద్దరు పిల్లలు ఉన్న తన అక్క మరణించడంతో ఓ యువతీ గొప్ప త్యాగాన్ని చేసింది.ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..

కుంచనపల్లికి చెందిన ఓ యువతీ కరోనా సెకండ్ వేవ్ సమయంలో కన్ను మూసింది. అయితే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఆమె చనిపోయిన తర్వాత భర్త ఇద్దరు పిల్లలను చూసుకుంటు భార్యలేని బాధను భరిస్తూ పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇక పిల్లలు కూడా తల్లి గురించి అడగటం అతనికి మరింత బాధ కలిగించేదట. ఈ నేపథ్యంలో చనిపోయిన మహిళ చెల్లి తన అక్క పిల్లలు మరియు భర్త పడుతున్న ఇబ్బందులను చూసింది. ఈ క్రమంలోనే ఆమె ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక తన అక్క పిల్లలకు తాను తల్లిగా మారి వారికి భవిష్యత్తును ఇవ్వాలి అనుకుంది. ఇక అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయగా వారు దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళకు వేరే సంబంధాలు చూస్తూ ఉండడంతోనేను అక్క భర్తను మాత్రమే పెళ్లి చేసుకుంటానని వేరే ఎవరిని చేసుకోనని సీరియస్ గా చెప్పుకొచ్చిందట.

ఇక తన అక్క భర్తకి ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పగా ఆయన కూడా ముందుగా వద్దని చెప్పాడట. అయినప్పటికీ తన అక్క పిల్లలను చూసుకునే బాధ్యత నాది అంటూ చెప్పుకొచ్చిందట.ఈ నేపథ్యంలోనే ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా చేయొద్దని బెదిరించారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తి రాసిచ్చి ఇష్టం వచ్చినట్లుగా చేసుకోమని తెలియజేశారట. దీంతో ఆమె వెంటనే తన అక్క భర్తను పోలీస్ స్టేషన్ లో వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ మహిళ తన వివరాలను తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే ఈమె చేసిన పనికి కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు.