Viral News : చిల్లర కోసం 7 మందిని హత్య చేసిన కిల్లర్

Viral News : ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుల్లుగా తాగాలి. ఆకలేసిందంటే ముక్క కచ్చితంగా ఉండాలి. ఇలాంటి కోరికలు దారి తప్పిన ఎందరినో చూస్తుంటారు. అయితే ఇలాంటి కోరికలు మాత్రమే ఉన్న ఒక అతను ఆ ఖర్చులకోసం దొంగ గా కాదు ఎకంగా ఒక కిల్లర్ గా మారాడు. ఏ సంపదలో నుంచీ కాదు రోజు కూలికి వెళ్లే ఆడాళ్ల దగ్గర దోచుకోవడం మొదలుపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…అతని పేరు కృష్ణయ్య వికారాబాద్ జిల్లా చెందిన ఈ […]

  • Published On:
Viral News : చిల్లర కోసం 7 మందిని హత్య చేసిన కిల్లర్

Viral News : ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుల్లుగా తాగాలి. ఆకలేసిందంటే ముక్క కచ్చితంగా ఉండాలి. ఇలాంటి కోరికలు దారి తప్పిన ఎందరినో చూస్తుంటారు. అయితే ఇలాంటి కోరికలు మాత్రమే ఉన్న ఒక అతను ఆ ఖర్చులకోసం దొంగ గా కాదు ఎకంగా ఒక కిల్లర్ గా మారాడు. ఏ సంపదలో నుంచీ కాదు రోజు కూలికి వెళ్లే ఆడాళ్ల దగ్గర దోచుకోవడం మొదలుపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…అతని పేరు కృష్ణయ్య వికారాబాద్ జిల్లా చెందిన ఈ వ్యక్తి అందరిలాగే తాగుడు కి అలవాటు పడ్డాడు. డబ్బులు ఉన్నప్పుడే తాగడం కాదు తాగడం కోసమే డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. మామూలుగా పనిచేస్తే వచ్చే ఆదాయం అనుకున్నంత తాగడానికి సరిపోదని తెలుసుకున్న కృష్ణయ్య అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం ఎలా అనుకున్న దాని పై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలోనే దొంగతనాలు చేయడం కన్నా నమ్మించి వారి మెడలో ఉన్న బంగారం కొంగులో ఉన్న కాసులు పెట్టి చక్కగా ఎంజాయ్ చేయవచ్చని ఈ ప్లాన్ లోకి దిగిపోయాడు.

ఆ క్రమంలో అతడు ఒక కిల్లర్ గా మారిపోయాడు. ఒకటి తర్వాత ఒకటి ఐదు మర్డర్లు చేశాడు. దొరికిపోయిన సరే తాను చేసినట్లు ఆధారాలు చట్టానికి దొరక్కుండా తప్పించుకునేత పకడ్బందీగా ఆ మర్డర్లు చేశాడు. అయితే ఒక కేసులో మాత్రం రెండేళ్లుగా జైల్లో ఉన్నాడు. ఇటీవల బెల్ మీద బయటకు వచ్చాడు. జైల్ నుంచి బయటకు వచ్చి కాసింత కాముగా ఉన్న కిట్టయ్య మళ్లీ తనలో ఉన్న రక్షత్వాన్ని బయటికి లేపాడు. తన తాగుడు కి డబ్బులు కోసం ఒక హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు.. దీనికోసమే కొన్ని రోజుల క్రితం తాండూరు మండలానికి చేరుకున్నాడు. అక్కడ బస్టాండ్ లో అతనికి సరదాబి అనే మహిళ ఎదురుపడింది . ఆమె మెడలో ఉండే పిస్తేలా తాడు మీద మనోడి కన్ను పడింది. వెంటనే ఆమెని అప్రోచ్ అయి ఒక చోట కూలి పని ఉంది అంటూ నమ్మించాడు. జహీరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించి మార్గం మధ్యలో ఓ అడవి ప్రాంతంలో దింపేశారు. అడవి మధ్యలో అమ్మ చీర కొంగు తో మెడకు ఉరి వేసి చంపేశాడు.

అనంతరం ఆమె దగ్గర ఉన్న పుస్తెల తాడు , సెల్ ఫోన్, పర్సులో ఉన్న కొంత డబ్బులు తీసుకొని పారిపోయాడు కూలికి అని చెప్పి ఇంటి నుండి వెళ్లిన భార్య ఇంటికి రాకపోవడంతో తన భర్త మహమద్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది .. పోలీసులు బస్టాండ్ లో ఉన్న సిసి టీవీని పరీక్షించగా సరదబీతో కృష్ణయ్య మాట్లాడడం ఆ తర్వాత ఇద్దరూ కలిసి బస్సు ఎక్కడ గమనించారు. ఈ క్రమంలోనే కిష్టయ్య హిస్టరీని పరిశీలిస్తే అతని మీద పెద్ద కేసు లే ఉండడంతో తన సొంతూరైన అల్లిపురం కీ చేరుకున్నారు. ఫుల్లుగా మందు కొట్టి గుడిసెలో నిద్రపోతున్న తనని కాలర్ పట్టుకుని వచ్చే స్టేషన్ లో వేశారు. ఆ తర్వాత జరిపిన విచారణ లో పోలీసుల కోటింగ్ పడింది. ఈ మర్డర్ తానే చేసినట్టుగా ఒప్పుకొని స్టేట్మెంట్ రికార్డ్ అయింది.