Unstoppable : అన్ స్టాపబుల్ షోలో బాలయ్యను, పవన్ కళ్యాణ్ ను ఆటాడేసుకున్న డైరెక్టర్ క్రిష్ ..!

Unstoppable :మనకు తెలిసిందే బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో రెండవ సీజన్ ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో. బాలయ్య హోస్టింగ్ కి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ షోకు హాజరై తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తన క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి ఈ షోలో ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు […]

  • Published On:
Unstoppable : అన్ స్టాపబుల్ షోలో బాలయ్యను, పవన్ కళ్యాణ్ ను ఆటాడేసుకున్న డైరెక్టర్ క్రిష్ ..!

Unstoppable :మనకు తెలిసిందే బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో రెండవ సీజన్ ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో. బాలయ్య హోస్టింగ్ కి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ షోకు హాజరై తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తన క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి ఈ షోలో ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఫస్ట్ ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ గ్లింప్స్ ను ఆహా విడుదల చేసింది. అందులో పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది. అయితే తాజాగా విడుదలైన ఈ వీడియోలో పవన్ ను, బాలయ్యను సరదా ప్రశ్నలతో ఆటపట్టించారు డైరెక్టర్ క్రిష్.

ఆయన అడిగిన ప్రశ్నలకు పవన్ నవ్వుతూనే సమాధానాలు ఇచ్చారు. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తన రాజకీయానికి సంబంధించిన విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను అంతగానో ఆకట్టుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవన్ కళ్యాణ్ అటు సినీ లైఫ్ ని, ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

Must Read : KA Paul : నెల రోజుల్లో కేఏ పాల్ భద్రత పై చర్యలు తీసుకోవాలని డీజీపిని ఆదేశించిన హైకోర్టు ..