RGV : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం…ఓటర్లకు ఆర్జీవి సంచలన పిలుపు…

RGV : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్జీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ…ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీకు న్యాయం జరుగుతుందనే నాయకులకు మాత్రమే వేయండి […]

  • Published On:
RGV : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం…ఓటర్లకు ఆర్జీవి సంచలన పిలుపు…

RGV : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు ఆర్జీవి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్జీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ…ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీకు న్యాయం జరుగుతుందనే నాయకులకు మాత్రమే వేయండి అంటూ చెప్పుకోచ్చారు. ఓటు అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి అలాంటి ఓటును అమ్ముకోవద్దని తెలియజేశారు.

telangana-assembly-elections-begin-rgv-sensational-call-to-voters

ప్రజలకు మంచి చేసే వారిని మాత్రమే గెలిపించుకోవాలని, ప్రజాహితం కోరుకునే వారిని గెలిపించుకోవడం సమాజానికి చాలా మంచిదని తెలియజేశారు. అలాగే మీ నియోజకవర్గంలో పూర్తి అవగాహన కలిగియుండి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలకు మౌలిక వసతులు కల్పించే నాయకులను గుర్తించి వారిని ఎన్నుకోవడమే ప్రజల బాధ్యత అంటూ ఆర్జీవి తెలంగాణ ప్రజలకు సూచించారు. అలాగే రాజకీయ పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోని నేను చూడలేదు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటును సరైన దిశగా వినియోగించుకోవాలని ఆర్జీవి తెలియజేశారు.