Anasuya Bharadwaj : దూల తీర్చేస్తా…మళ్లీ రెచ్చిపోయిన అనసూయ….
Anasuya Bharadwaj : బుల్లితెరపై తనదైన రీతులొ యాంకరింగ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న అనసూయ జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. అందులో భాగంగానే ఆమె సంపాదించుకున ఇమేజ్ తో వరుసగా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి.ముఖ్యంగా ఆమె నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించింది.దానితో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంది. ఇక సినీ కెరియర్ పరంగా చాలా […]
![Anasuya Bharadwaj : దూల తీర్చేస్తా…మళ్లీ రెచ్చిపోయిన అనసూయ….](https://telugutopnews.com/wp-content/uploads/2024/01/Untitled-6.jpg)
![Anasuya Bharadwaj : దూల తీర్చేస్తా…మళ్లీ రెచ్చిపోయిన అనసూయ….](https://telugutopnews.com/wp-content/uploads/2024/01/Untitled-6.jpg)
Anasuya Bharadwaj : బుల్లితెరపై తనదైన రీతులొ యాంకరింగ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న అనసూయ జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. అందులో భాగంగానే ఆమె సంపాదించుకున ఇమేజ్ తో వరుసగా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి.ముఖ్యంగా ఆమె నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించింది.దానితో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంది. ఇక సినీ కెరియర్ పరంగా చాలా సంతృప్తిగా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వలన ఏదో ఒక విషయంలో స్పందిస్తూ ఎప్పుడు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ట్రోల్స్ కి గురైన కూడా తన బిహేవియర్ ని మార్చుకోకుండా అలాగే ఉంటుంది అనసూయ. అంతే కాక ఆమెను ట్రోల్ చేసిన వారి పైన విరుచుకుపడింది. మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ ను ఉద్దేశిస్తూ చాలా కామెంట్స్ చేస్తుంది. దానితో అతని ఫాన్స్ ఈమె పై సీరియస్ అవుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేసిన ఖుషి సినిమా పై కూడా కొన్ని కామెంట్లు అయితే చేసింది. విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు ది విజయ్ దేవరకొండ అని పెట్టుకోవడం కరెక్ట్ కాదు అంటూ అతనిపైన కొన్ని విమర్శలు చేసింది. దానితో అతని ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా అనసూయ ను ఆట ఆడుకున్నారు .
అయినా కూడా కొంచెం కూడా తగ్గకుండా తను కూడా వాళ్లకి కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేసింది. దాంతో తన పైన ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ల మీద కేసులు కూడా పెట్టింది. ఇక ఇప్పుడు 2023వ సంవత్సరము ముగిసి కాస్త కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభమెల ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అదేంటి అంటే 2023వ సంవత్సరంలో తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే పర్లేదు ఇక ఈ సంవత్సరం కూడా తన జోలికి ఎవరైనా వస్తే దూల తీర్చి దూపం వేస్తా అంటూ రెచ్చిపోయింది. ఇక ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక 2023వ సంవత్సరంలో రంగమార్తాండ, విమానం, పెదకాపు వంటి సినిమాలలో నటించింన అనసూయ మంచి సక్సెస్ తో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే అనసూయ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.
View this post on Instagram