Janhvi Kapoor : తిరుమలలో బాయ్ ఫ్రెండ్ తో జాన్వి కపూర్…

Janhvi Kapoor  : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇతరులు కీలకపాత్రలు పోషించారు. కొరటాల శివ దర్శకత్వంలో యువ సుధా ఆర్ట్స్ మరియు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో […]

  • Published On:
Janhvi Kapoor : తిరుమలలో బాయ్ ఫ్రెండ్ తో జాన్వి కపూర్…

Janhvi Kapoor  : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇతరులు కీలకపాత్రలు పోషించారు. కొరటాల శివ దర్శకత్వంలో యువ సుధా ఆర్ట్స్ మరియు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఆర్ఆర్ఆర్ బ్లాక్ మాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడం తో దీనిపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి.

janhvi-kapoor-with-her-boyfriend-visits-tirumala-temple

ఈ సినిమా నుండి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ హైప్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ తేదీలోగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సినీ బృందం ప్రయత్నం చేస్తుంది. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత అంతకుమించిన స్థాయిలో దేవర మూవీని తీయాలని ఉద్దేశంతో మూవీ టీం ఉంది. ఈ క్రమంలోనే దేవర ఫస్ట్ డ్రీమ్స్ ఈనెల 8వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఒక స్మాల్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. దీనికోసం అంతా సిద్ధమై ఉంది.

అయితే దేవర మూవీ క్లిప్స్ రిలీజ్ కు సిద్ధమైతే దేవర హీరోయిన్ జాన్వి కపూర్ మాత్రం తిరుమల లో ప్రత్యక్షమైంది.ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. తన స్నేహితుడు శిఖర్ పర్య మరియు గులాబీ ఫ్రేమ్ మహేశ్వరి తో విఐపి బ్రేక్ సమయంలో జాన్వీ శ్రీవారిని దర్శించుకున్నారు.స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకి వేద ఆశీర్వాచనం పలికారు.స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అయితే ఏడాది కాలంలో జాన్వికపూర్ శ్రీవారి దర్శనానికి రావడం ఇది రెండోసారి. గత ఏడాది ఏప్రిల్ మూడవ తేదీ న ఆమె శ్రీవారిని దర్శించిన విషయం తెలిసిందే. అలాగే షికార్ పర్య జాన్వి కపూర్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని గతంలో కాఫీ విత్ కరం లో ఈ విషయాన్ని సూచనప్యాయంగా వెల్లడించారు.ఈ పరిస్థితుల లో వారిద్దరూ శ్రీవారి దర్శనంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.