Kumari Aunty : బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్న ఫాస్ట్ ఫుడ్ కుమారి ఆంటీ…

Kumari Aunty  : మన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి పేరు ప్రఖ్యాతలు అందుకున్న బుల్లితెర కార్యక్రమం లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట్లో అంత పాపులర్ అవ్వకపోయినా సెకండ్ సీజన్ నుంచి మంచి ఫేమస్ అయింది. ఇక ఇటీవల 7వ సీజన్ కంప్లీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నడు లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 7 కి ఎక్కువ టిఆర్పి దక్కింది. దీనితో బిగ్ బాస్ 8వ సీజన్ పై […]

  • Published On:
Kumari Aunty : బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్న ఫాస్ట్ ఫుడ్ కుమారి ఆంటీ…

Kumari Aunty  : మన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి పేరు ప్రఖ్యాతలు అందుకున్న బుల్లితెర కార్యక్రమం లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట్లో అంత పాపులర్ అవ్వకపోయినా సెకండ్ సీజన్ నుంచి మంచి ఫేమస్ అయింది. ఇక ఇటీవల 7వ సీజన్ కంప్లీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నడు లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 7 కి ఎక్కువ టిఆర్పి దక్కింది. దీనితో బిగ్ బాస్ 8వ సీజన్ పై బారి అంచనాలే ఉన్నాయి. 8వ సీజన్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ సీజన్ కోసం కొందరు సెలెక్ట్ అయినట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఫుడ్ షాప్ ద్వారా మంచి ఫేమస్ అయిన కుమారి ఆంటీ బిగ్ బాస్ 8వ సీజన్ కు వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈమె తన మాట తీరుతో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ క్రమంలోనే ఈ సారి బిగ్ బాస్ తన సీజన్ కు హాట్ టాపిక్ అయిన వారిని తీసుకుంటే టి ర్ పి రేటింగ్ పెరుగుతుందని చర్చించి బిగ్ బాస్ టీం ఆమెకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఆఫర్ చూసిన ప్రేక్షకులు బిగ్ బాస్ కి వెళ్లాలని అక్కడ ఎంతో మంది సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని ఇండస్ట్రీలో పరీక్షించుకుంటున్నారు. వాళ్లకి ఆపర్చునిటీ ఇవ్వకుండా రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు కి ఇచ్చేస్తారా..

వారి పని వారు చేసుకొని బ్రతుకుతున్నారు. వారికి ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని అంటున్నారు. అయితే కొంతమంది బిగ్ బాస్ కి వెళ్తేనే తమ కెరీర్ నిలబడుతుందని అదే ఆశతో ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు. వారికి ఈ అవకాశం ఇవ్వడం వలన వారి స్థాయి మరింత పెరుగుతుంది. అలాంటి వారిని తీసుకోకుండా ఇలాంటి వారిని ఎందుకు తీసుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు అంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. మరి కొందరు ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని టీవీ చానెల్స్ కావాలనే ఇలా చేస్తున్నారు అని చెబుతున్నారు.