Rangasthalam : రంగస్థలం రంగమ్మత్త పాత్రను వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…ఆరోజు అలా ఎందుకు చేసిందంటే…
Rangasthalam : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ను తెచ్చి పెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే రంగస్థలం అని చెప్పాలి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తలకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ నటన కు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ జీవించేశాడు. చెవిటి వాడిగా చరణ్ పలికించిన హావభావాలు సినిమా మొత్తానికి హైలైట్ గా […]
Rangasthalam : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ను తెచ్చి పెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే రంగస్థలం అని చెప్పాలి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తలకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ నటన కు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ జీవించేశాడు. చెవిటి వాడిగా చరణ్ పలికించిన హావభావాలు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. దీంతో ఇన్నాళ్లు ఈ నటన ను ఎక్కడ దాచి పెట్టావ్ చిట్టి బాబు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత పల్లెటూరి అమ్మాయి నేపథ్యంలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అనసూయ నటించి అందరిని మెప్పించింది. రంగమ్మత్త పాత్ర లో అనసూయ చేసిన నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అనసూయను రంగమ్మత్త అనే పేరుతో పిలవడం మొదలెట్టారంటే ఆ పాత్ర తనకు ఎంతటి పేరును తెచ్చిపెట్టిందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అనసూయకు వరుసగా అవకాశాలు రావడం కూడా మొదలయ్యాయి. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
అయితే రంగమ్మత్త క్యారెక్టర్ కు అనసూయ కంటే ముందు ఒక స్టార్ హీరోయిన్ ని ఆ పాత్రలో చేయించాలని సుకుమార్ అనుకున్నారట. ఆమె మరెవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన రాశి. సుకుమార్ ముందుగా రంగమ్మత్త పాత్ర కోసం రాశి ని సంప్రదించారట. కానీ రాశికు ఆ పాత్రలోని వస్త్రాలంకరణ నచ్చకపోవడంతో నో చెప్పిందట. దీంతో ఈ అవకాశం అనసూయ దక్కించుకునే రంగమ్మత్తగా మంచి పేరును సాధించింది. అదే రంగమ్మత్త పాత్ర లో అనసూయ బదులుగా రాశి నటించి ఉంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.