Shilpa Shetty : విడాకుల బాటలో మరో స్టార్ జంట….అసలు కారణం ఇదేనట…
Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి తన భర్తతో విడిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని తాజాగా ఆమె భర్త రాజ్ కుంద్రా ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన భార్యతో అతను విడిపోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఆయన షేర్ చేసిన పోస్ట్ లో శిల్ప గురించి ప్రస్తావించకుండా..మేము విడిపోయాము ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానంటూ […]
![Shilpa Shetty : విడాకుల బాటలో మరో స్టార్ జంట….అసలు కారణం ఇదేనట…](https://telugutopnews.com/wp-content/uploads/2023/10/Untitled-9-4.jpg)
![Shilpa Shetty : విడాకుల బాటలో మరో స్టార్ జంట….అసలు కారణం ఇదేనట…](https://telugutopnews.com/wp-content/uploads/2023/10/Untitled-9-4.jpg)
Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి తన భర్తతో విడిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని తాజాగా ఆమె భర్త రాజ్ కుంద్రా ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన భార్యతో అతను విడిపోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఆయన షేర్ చేసిన పోస్ట్ లో శిల్ప గురించి ప్రస్తావించకుండా..మేము విడిపోయాము ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం రాజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. వీరు నిజంగానే విడిపోయారా..:?విడాకులు కూడా తీసుకున్నారా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో మొదలయ్యాయి. మరికొందరు మాత్రం రాజ్ కుంద్రా చేసిన ట్విట్ విడాకుల గురించి కాదని గత కొన్ని ఏళ్లుగా తనతో ఉంటున్న మాస్క్ గురించి చెప్పాడని…
ఇకపై మాస్క్ ఉపయోగించరని ఇలా ట్విట్టర్ వేదికగా తెలియజేసినట్లు కామెంట్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే మరోవైపు శిల్పా శెట్టి సోషల్ మీడియా ఖాతాలలో విడాకులకు సంబంధించిన ఎలాంటి వార్తలు కనిపించడం లేదు. అంతేకాక ఇటీవల తన భర్త నటించిన కొత్త UT69 పోస్ట్ చేస్తూ బెస్ట్ విషెస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా మాస్క్ గురించి ట్విట్ చేశాడని క్లారిటీ వస్తుంది. అయితే రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు . ఇక వీరిద్దరికీ వియాన్, సమీషా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల రాజ్ తన బయోపిక్ ను UT 69 గా సినిమా తీస్తున్నాడు. అలాగే ట్రైలర్ లాంచ్ లో నీలి చిత్రాల కేసులో తాను జైలు జీవితం గడపడం గురించి మాట్లాడారు.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
2021లో రాజ్ నీలి చిత్రాల కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయియి కొన్నాళ్లపాటు జైల్లో ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. ఇక అప్పటినుండి రాజ్ తన ముఖాన్ని చూపించకుండా మాస్క్ ధరించి తిరుగుతున్నాడు. అయితే చాలా రోజులుగా మాస్క్ ధరించి తిరుగుతున్న రాజ్ ఇటీవల UT 69 సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలలో మాస్క్ తీసి కనిపించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను నొప్పితో మాస్క్ ను ధరించానని….మీడియా విచారణ అంటే చాలా బాధాకరమని, కానీ నేను మీడియాను విమర్శించను వారి పని వారు చేస్తున్నారు కాబట్టి , కని నేను మాస్క్ ధరించి తిరగడం చాలా బాధాకరం అనిపించింది అని చెప్పుకోచ్చాడు.
View this post on Instagram