Pushpa 2 movie : 40 రోజులు 12 నిమిషాలు పూనకాలు పుష్ప గంగమ్మ తల్లి జాతర అప్డేట్…

Pushpa 2 movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప ది రూల్ . అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ భారీ విజయని తన ఖాతాలో వేసుకుంది. దీంతో పుష్ప పార్ట్ 2 పై అభిమానుల లో కూడా బారి అంచనాలే ఉన్నాయి. అయితే పుష్ప 2 షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన […]

  • Published On:
Pushpa 2 movie : 40 రోజులు 12 నిమిషాలు పూనకాలు పుష్ప గంగమ్మ తల్లి జాతర అప్డేట్…

Pushpa 2 movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప ది రూల్ . అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ భారీ విజయని తన ఖాతాలో వేసుకుంది. దీంతో పుష్ప పార్ట్ 2 పై అభిమానుల లో కూడా బారి అంచనాలే ఉన్నాయి. అయితే పుష్ప 2 షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన పుష్ప 2 నుంచి గ్లిమ్స్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను ఒకప్పుడు జానీ మాస్టర్ అసిస్టెంట్ అయినా షష్టి వర్మ కొరియోగ్రాఫర్ సోషల్ మీడియాలో సినిమా అప్డేట్ గురించి పోస్ట్ చేసింది. అయితే ఆ వార్త చిన్నదే అయిన క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకు అంటారా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ని షష్టి మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తుంది. అయితే తన సోషల్ మీడియాలో పుష్ప 2 షూట్ యొక్క వివరాలను పంచుకుంది. అయితే ఈ సినిమాలో 40 రోజుల పాటు జరిగిన మోస్ట్ ఇంపాక్టబుల్ ఎపిసోడ్ ఆన్ స్క్రీన్ పైన దాదాపు 12 నిమిషాల పాటు ఉంటుందని షష్టి వర్మ తెలిపింది. ఇక పుష్ప 2 ఎపిసోడ్ కె , ఈ ఎపిసోడ్ స్పెషల్ హైలైట్ గా నిలుస్తుంది అని సినిమా ఇండస్ట్రీ నుంచి అనేక వార్తలు వస్తున్నాయి.

అయితే షష్టి కొరియోగ్రాఫర్ తన మాటల్లో అఫీషియల్ గా ఈ విషయాలను తెలపడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్ కోసం మూవీ టీం విదేశాలలో ప్లాన్ చేస్తున్నారంట. ఇక పుష్ప రాజ్ త్వరలో ఈ షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కబోతున్నారు అని తెలుస్తుంది. ఇక విదేశాలలో యాక్షన్ సీక్వెల్స్ తో పాటు మరికొన్ని కీలక సీన్స్ అక్కడే షూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే పుష్ప 2 జపాన్ లో షెడ్యూల్ నిర్వహించినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సుకుమార్ రేటింగ్స్ మరియు మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చాలామంది కీలకపాత్రల పోషిస్తున్నారు. అందులో సునీల్ , అనసూయ , ధనుంజయ తదితర పాత్రలో నటిస్తున్నారు. ఏది ఏమైనా గంగమ్మ తల్లి అవతారంలో పుష్ప రాజ్ ఎంట్రీ ఇవ్వడం మొదలు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.