Viral Video : మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు…మధ్యలోకి వెళ్ళగానే…

Viral Video : పట్టణాల్లో ఉరుకు పరుగుకల మధ్య జీవితాలను గడిపేవారు పండుగ సమయాలలో సొంత ఊర్లకి వెళ్లి జలసాలు చేస్తుంటారు. అలాగే నిత్యం పల్లెటూర్లలో ఉంటూ పట్టణ ప్రపంచం అంటే తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటివారు సందర్భానుసారం పట్టణాలలో అడుగుపెడుతుంటారు. ఇక ఈ సమయంలో వీరికి ఏదో వింత ప్రపంచం లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ వస్తుంటుంది. ఈ క్రమంలోనే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా చదువు రాని […]

  • Published On:
Viral Video : మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు…మధ్యలోకి వెళ్ళగానే…

Viral Video : పట్టణాల్లో ఉరుకు పరుగుకల మధ్య జీవితాలను గడిపేవారు పండుగ సమయాలలో సొంత ఊర్లకి వెళ్లి జలసాలు చేస్తుంటారు. అలాగే నిత్యం పల్లెటూర్లలో ఉంటూ పట్టణ ప్రపంచం అంటే తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటివారు సందర్భానుసారం పట్టణాలలో అడుగుపెడుతుంటారు. ఇక ఈ సమయంలో వీరికి ఏదో వింత ప్రపంచం లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ వస్తుంటుంది. ఈ క్రమంలోనే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా చదువు రాని వారి పరిస్థితి ఇంకా దినంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే…తాజాగా ఓ ఇద్దరు పల్లెటూరు మహిళలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..

అయితే మొట్టమొదటిసారి ఎస్కలేటర్ ఎక్కబోతున్న ఇద్దరి మహిళలకు ఓ చేదు అనుభవం ఎదురయింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పల్లెటూరు వాతావరణం లో పెరిగిన ఇద్దరు మహిళలు అనుకోకుండా నగరంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వారికి పట్టణమంతా కొత్త ప్రపంచంల కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది కానీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్ వద్ద ఉన్న ఎస్కలేటర్ వద్దకు రాగానే అంతా తారు మారైనది. ఎస్కలేటర్ ను ఎలా ఎక్కాలో వారికి తెలియకపోవడంతో చాలాసేపు ఆలోచించుకుని ధైర్యం చేసి ఎస్కలేటర్ పై అడుగు పెట్టారు. ఈ క్రమంలో మెట్లు పైకి వెళుతుండడంతో వీరి భయం మరింత పెరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎక్సిలేటర్ కాస్త ఎత్తుకు చేరగానే బ్యాలెన్స్ కోల్పోయి ఇద్దరు కింద పడ్డారు.

ఇక పక్కన ఉన్న వారంతా చూస్తూ ఉండిపోయారు కానీ వారికి మాత్రం ఎవరు సహాయం చేయలేదు. అలా కిందపడిన మహిళలు ఎలాగోలా పైకి లేచి మెట్లపైనేే కూర్చున్నారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ సందర్భంలో వారిని కాపాడాల్సింది పోయి కొందరు వీడియో తీసి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఈ వీడియో చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయ్యో పాపం ఎంత అమాయకులని కొందరు అంటుంటే..సాయం చేయకుండా వీడియో తీయడం దారుణం అంటూ మరికొందరు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lalitpur King (@bundeli_super_star)