Viral News : ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం….భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి తెలివిగా మట్టు పెట్టిన భార్య…

Viral News : వరంగల్ మూడవ డివిజన్ పైడిపల్లి పరిధిలోని ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపిన సమాచారం ప్రకారం ఆర్ ఎన్ ఆర్ నగర్ లో బట్టు వెంకన్న అనే వ్యక్తి తన భార్య స్వప్నతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల ఏప్రిల్ 21న వెంకన్న అనుమానస్పదంగా మృతి చెందడంతో అతని తమ్ముడు లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు […]

  • Published On:
Viral News : ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం….భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి తెలివిగా మట్టు పెట్టిన భార్య…

Viral News : వరంగల్ మూడవ డివిజన్ పైడిపల్లి పరిధిలోని ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపిన సమాచారం ప్రకారం ఆర్ ఎన్ ఆర్ నగర్ లో బట్టు వెంకన్న అనే వ్యక్తి తన భార్య స్వప్నతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల ఏప్రిల్ 21న వెంకన్న అనుమానస్పదంగా మృతి చెందడంతో అతని తమ్ముడు లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వెంకన్న పోస్టు మార్టం నివేదికలో గొంతు నులమడం వలన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ కేసును హత్య గా నమోదు చేశారు.

అయితే వెంకన్న భార్య స్వప్న పరారీలో ఉండడంతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఆమెను పట్టుకున్నారు. ఇక ఆమెను విచారించగా స్వప్నకు అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ లావుడ్యా ప్రశాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే స్వప్న మరియు ప్రశాంత్ లు సన్నిహితంగా ఉండటం గమనించిన కాలనీవాసులు , స్వప్న భార్య వెంకన్నకు విషయం తెలియజేశారు. దీంతో వెంకన్న తన భార్య స్వప్నను మందలించడంతో పలుసార్లు వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇక ఈ విషయాన్ని స్వప్న తన ప్రియుడు ప్రశాంత్ కు తెలపగా వెంకన్నను చంపేందుకు ఇద్దరు పథకం పన్నారు. ప్రియుడు సహకారంతో స్వప్న తన భర్త వెంకన్నను ఏప్రిల్ 21న హత్య చేసింది.

అయితే ఏప్రిల్ 21న వెంకన్న మద్యం తాగి వచ్చి భార్య స్వప్నతో గొడవపడి, తర్వాత అన్నం తిని పడుకున్నాడు. అదే రోజు సుమారు అర్థం రాత్రి ఒంటి గంట సమయంలో స్వప్న తన ప్రియుడు ప్రశాంత్ కు ఫోన్ చేసి చెప్పగా ….ఇంకెన్నాళ్లు భరిస్తావ్..నీకు నేనున్నాను…ఎలాగైనా వాడిని చంపేయమని చెప్పాడు. దీంతో స్వప్న గాడ నిద్రలో ఉన్న తన భర్తను గొంతు నూలిమి చంపింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు స్వప్న ప్రశాంత్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది.