Success Story : చాయ్ అమ్మి 150 కోట్లు సంపాదించాడు…ఇతని సక్సెస్ స్టోరీ వింటే ఆశ్చర్యపోవాల్సిందే…
Success Story : దేశంలో చాలామంది విద్యార్థులు ఐఏఎస్ కావాలని కలలు కంటూ ఉంటారు. ఇక వారి కలలను నెరవేర్చుకోవడం కోసం రాత్రి పగలు ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఇలా ప్రయత్నించే వారిలో కొంతమంది చాలా ఆలస్యంగా వారి కలలను నెరవేర్చుకున్న మరికొందరు వారి కలలను నెరవేర్చుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఐఏఎస్ కావాలని కోరుకున్న అనుభవ్ దూబే ఐఏఎస్ కావాలనే తన కలలను నెరవేర్చుకోలేకపోయిన తన తెలివితేటలతో వ్యాపారం మొదలుపెట్టి దాదాపు 150 […]
![Success Story : చాయ్ అమ్మి 150 కోట్లు సంపాదించాడు…ఇతని సక్సెస్ స్టోరీ వింటే ఆశ్చర్యపోవాల్సిందే…](https://telugutopnews.com/wp-content/uploads/2023/10/Untitled-2-8.jpg)
![Success Story : చాయ్ అమ్మి 150 కోట్లు సంపాదించాడు…ఇతని సక్సెస్ స్టోరీ వింటే ఆశ్చర్యపోవాల్సిందే…](https://telugutopnews.com/wp-content/uploads/2023/10/Untitled-2-8.jpg)
Success Story : దేశంలో చాలామంది విద్యార్థులు ఐఏఎస్ కావాలని కలలు కంటూ ఉంటారు. ఇక వారి కలలను నెరవేర్చుకోవడం కోసం రాత్రి పగలు ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఇలా ప్రయత్నించే వారిలో కొంతమంది చాలా ఆలస్యంగా వారి కలలను నెరవేర్చుకున్న మరికొందరు వారి కలలను నెరవేర్చుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఐఏఎస్ కావాలని కోరుకున్న అనుభవ్ దూబే ఐఏఎస్ కావాలనే తన కలలను నెరవేర్చుకోలేకపోయిన తన తెలివితేటలతో వ్యాపారం మొదలుపెట్టి దాదాపు 150 కోట్లు సంపాదించాడు. 23 సంవత్సరాల వయసు గల అనుభవ్ భూబె ఐఏఎస్ లో ఫెయిల్ కావడంతో వ్యాపారవేత్తగా మారాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా అనే ప్రాంతానికి చెందిన అనుభవ్ దుబేకి ఆనంద్ నాయక్ అనే మంచి స్నేహితుడు ఉన్నాడు. అయితే అనుభవ తండ్రి బిజినెస్ మెన్ కాగా తన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని భావించారట. అయితే అభినవ్ దూపే సీఐ , యుపిఎస్సి వంటి పరీక్షలలో ఫెయిల్ అవ్వడంతో తండ్రి కలలను నెరవేర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో చాయ్ సుత్త బార్ అనే కంపెనీకి ఫౌండర్ గా మారిన అనుభవం ఐదు సంవత్సరాలలోనే ఆ కంపెనీని మూడు రక్షల నుండి 150 కోట్ల రేంజ్ కు తీసుకెళ్లాడు. తన స్నేహితుడు ఆనంద్ నాయక్ తో కలిసి కేవలం 3 లక్షల రూపాయలతో అమ్మాయిల హాస్టల్ ఎదురుగా తొలి ఔట్లెట్ ను అనుభవ్ మొదలుపెట్టాడు.
ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా 195 నగరాలలో వీరి ఔట్లెట్స్ ఉండడం గమనార్హం. ఇక ఈ సంవత్సరం వీరి కంపెనీ యొక్క వార్షిక విలువ 150 కోట్లు గా ఉంది. ఇక ఈ చేయి సుత్త బార్ లో మట్టిి కప్పులు ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 150 మందికి పైగా పని చేస్తుండగా వీరిలో ఇంజనీర్లు ,ఎంబీఏ పూర్తి చేసినవాళ్లు కూడా ఉన్నారు. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న అనుభవ్ ఈ విధంగా సక్సెస్ సాధించారు. తన సక్సెస్ తో ఎంతోమందికి జీవనాధారాన్ని కూడా అందిస్తున్నాడు. ఇక అనుభవ్ సక్సెస్ స్టోరీ నేటి యువతకి స్ఫూర్తిదాయకమని చెప్పాలి.