Viral news : 6ఏళ్ళు ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన ప్రియుడు..ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..

Viral news : ఈ రోజుల్లో ప్రేమించుకుని విడిపోవడం సర్వసాధారణంగా మారింది. కొన్నేళ్లపాటు ప్రాణంగా ప్రేమించుకున్న వారు కూడా సడన్ గా ప్రేమించుకున్న వారిని వదిలేసి వేరే వారితో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే అలాంటి సంఘటనె ఒకటి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు లో చోటుచేసుకుంది. రామచంద్రపురానికి చెందిన వినూత్నేశ్వరి అనే యువతి పటేల్ గూడా లోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చేస్తుండగా అక్కడ ఏర్ల ప్రశాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి […]

  • Published On:
Viral news : 6ఏళ్ళు ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన ప్రియుడు..ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..

Viral news : ఈ రోజుల్లో ప్రేమించుకుని విడిపోవడం సర్వసాధారణంగా మారింది. కొన్నేళ్లపాటు ప్రాణంగా ప్రేమించుకున్న వారు కూడా సడన్ గా ప్రేమించుకున్న వారిని వదిలేసి వేరే వారితో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే అలాంటి సంఘటనె ఒకటి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు లో చోటుచేసుకుంది. రామచంద్రపురానికి చెందిన వినూత్నేశ్వరి అనే యువతి పటేల్ గూడా లోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చేస్తుండగా అక్కడ ఏర్ల ప్రశాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత 6 సంవత్సరాలు గా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

కాలేజీ రోజుల్లో పెళ్లి చేసుకుంటానని ఇంతకాలం ప్రేమ వ్యవహారం నడిపించిన ప్రశాంత్ సడన్ గా ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టేసి ఈ శుక్రవారం పొద్దు వేరే అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకున్నాడు. ప్రేమించే వరకు వెంటపడి ప్రాణంగా ప్రేమించిన తర్వాత ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకోవడంతో మనస్థాపానికి గురైన యువతి మోసపోయానని బలన్మరణానికి సిద్ధపడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువతని పటాన్ చేరువు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న ప్రశాంత్ తండ్రి మాజీ ఎంపీ దేవానంద్ తన కుటుంబ సభ్యులతో వచ్చి బాధితురాలి కుటుంబంతో చర్చలకు దిగారు. మీడియాతో మాట్లాడిన బాధితురాలు తనను ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక, విష పదార్థాలు తిన్నానని చెప్పింది. తన ప్రియుడు ప్రశాంత్ తో నాకు వివాహం జరిగేలా చేయమని కోరుతుంది. తాను ప్రేమించిన వాడినే నేను చేసుకుంటానని నాకు న్యాయం చేయమని వేడుకుంటుంది. అయితే తన ప్రియుడు తండ్రి పలుకుబడి తో చూసుకొని పరస్పర ఓపందం చేసుకుంటాడా లేక ప్రియురాలిని పెళ్లి చేసుకుని న్యాయం చేస్తాడో వేచి చూడాలి.