Viral News : అనుమానస్పద రీతిలో ఇంటర్ విద్యార్థి మృతి…ఆ ముగ్గురే చంపి ఉంటారా…..

Viral News : చిత్తూరు జిల్లా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ అనేే విద్యార్థి మృతి మిస్టరీగా మారింది. అయితే మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ మృతదేహం పై గాయాలు ఉండడం మృతురాలి తలపై జుట్టు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రేమ పేరుతో తన కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని ఆ యువకులే తన కుమార్తెను మాయమాటలు చెప్పి ఇంటి నుండి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడికట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. కనురెప్పలు కోసేసి జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి […]

  • Published On:
Viral News : అనుమానస్పద రీతిలో ఇంటర్ విద్యార్థి మృతి…ఆ ముగ్గురే చంపి ఉంటారా…..

Viral News : చిత్తూరు జిల్లా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ అనేే విద్యార్థి మృతి మిస్టరీగా మారింది. అయితే మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ మృతదేహం పై గాయాలు ఉండడం మృతురాలి తలపై జుట్టు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రేమ పేరుతో తన కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని ఆ యువకులే తన కుమార్తెను మాయమాటలు చెప్పి ఇంటి నుండి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడికట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. కనురెప్పలు కోసేసి జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి బావిలో పడేసినట్లుగా భవ్య శ్రీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదని దోషులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఇక పూర్తి వివరాల్లోకెళ్తే….

inter-students-death-in-a-suspicious-manner-could-those-three-have-killed-him

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కావూరివారి పంచాయతీ వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ పద్మల కుమార్తె భవ్య శ్రీ పెనుమూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. ఈ క్రమంలోని భవ్యశ్రీ కి ఓ ఇద్దరి యువకులతో పరిచయం ఏర్పడింది. వారితోనే ఎక్కువగా బయటకు వెళుతూ ఉంటుంది. అయితే ఈనెల 17న బయటకు వెళ్లిన భవ్యశ్రీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కల వెతికారు. ఆమె స్నేహితులకు కూడా ఫోన్లు చేసి అడిగి తెలుసుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పెనుమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగా ఈనెల 19న వేణుగోపాలపురం సమీపంలోని ఓ బావిలో యువతి మృతదేహం కనిపించింది.

inter-students-death-in-a-suspicious-manner-could-those-three-have-killed-him

వినాయకుని నిమజ్జనం చేయడం కోసం బావి వద్దకు వచ్చిన గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని మృతదేహాన్ని బయటికి తీసి భవ్యశ్రీగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు. అయితే మృతదేహానికి జుట్టు లేకపోవడంతో భవ్యశ్రీ ని చంపేసి కళ్ళు పీకి జుట్టు కత్తిరించి మృతదేహాన్ని బావిలో వేసినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు భవ్యశ్రీ ధరించిన లెగ్గిన్ లేకపోవడం, అలాగే నాలుక కొరికి ఉండడం తో యువతి పై బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇక భవ్య శ్రీ మృతిపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. తాజాగా భవ్యశ్రీ వెంట్రుకలు దొరకడంతో వాటిని తిరుపతిలోని ఆర్ ఎఫ్ ఎఫ్ ఎస్ ల్యాబ్ కి పంపించినట్లు తెలియజేశారు.

inter-students-death-in-a-suspicious-manner-could-those-three-have-killed-him

ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తామని, భవ్య శ్రీ మృతదేహం బావిలో మూడు నాలుగు రోజులు ఉండటం వలన జుట్టు ఊడిపోయి ఉంటుందని వైద్యులు అంటున్నారని పోలీసులు తెలియజేశారు.ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ సంఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఏ మీడియాలోనూ ఈ వార్త ప్రచారం కాలేదు. దీంతో కావాలనే ఈ వార్తను బయటికి రానివ్వకుండా చేస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వార్త వెలుగులోకి రావడంతో ప్రతి ఒక్కరు భవ్యశ్రీ కి న్యాయం జరగాలని కోరుతున్నారు.