Pallavi Prashanth : 50 మంది లాయర్లతో స్టార్ యాంకర్ పై పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా…

Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మరియు యాంకర్ శివ మధ్య ప్రస్తుతం వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత ముదిరింది అని చెప్పాలి. అయితే పల్లవి ప్రశాంత విన్నర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానని పిలిచి యాంకర్ శివను గంటల తరబడి వెయిట్ చేయించడం , ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వకుండా దారుణంగా అవమానించాడని చాలామంది యూట్యూబర్స్ ప్రచారం చేయసాగారు. ఈ నేపథ్యంలోనే […]

  • Published On:
Pallavi Prashanth : 50 మంది లాయర్లతో స్టార్ యాంకర్ పై పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా…

Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మరియు యాంకర్ శివ మధ్య ప్రస్తుతం వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత ముదిరింది అని చెప్పాలి. అయితే పల్లవి ప్రశాంత విన్నర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానని పిలిచి యాంకర్ శివను గంటల తరబడి వెయిట్ చేయించడం , ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వకుండా దారుణంగా అవమానించాడని చాలామంది యూట్యూబర్స్ ప్రచారం చేయసాగారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ పై తీవ్ర విమర్శలు చేయసాగాడు.

Pallavi Prashanth: స్టార్ యాంకర్ పై పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా… 50 మంది లాయర్లతో రంగం సిద్ధం! | pallavi prashanth filed a defamation suit against the star anchor

పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇస్తానని పిలిచి దారుణంగా అవమానించాడని బూతులు తిడుతూ వీడియో రిలీజ్ చేశాడు శివ. అంతేకాక యాంకర్ శివతో పాటు చాలామంది యూట్యూబర్స్ కి పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని ,దానికిగాను పల్లవి ప్రశాంత్ ను తిడుతూ నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రశాంత్ అరెస్టు కాడానికి ముందు కూడా అతనిని కావాలనే నెగిటివ్ చేస్తున్నారని వారి పేర్లను కూడా బయట పెడతానని చెప్పాడు ప్రశాంత్. అయితే అరెస్ట్ అయిన 48 గంటల్లోనే ప్రశాంత్ బెయిల్ లభించింది.

నాంపల్లి కోర్టులో షరతులతో కూడిన బెయిల్ ను ప్రశాంత్ కు మంజూరు చేయడం జరిగింది. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన యాంకర్ శివతో పాటు కొంతమంది యూట్యూబర్స్ పై పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బెయిల్ వచ్చిన తర్వాత తన లాయర్లతో కలిసి మాట్లాడిన ప్రశాంత్ తనపై నెగిటివ్ ప్రచారం చేసిన వారిని గుర్తించి వారిపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రశాంత్ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు తెలియజేయడం జరిగింది.

తగ్గేదేలే అంటున్న పల్లవి ప్రశాంత్!#pallaviprashanth #biggboss # #trendingshorts - YouTube

అంతేకాక ప్రశాంత తరపున దాదాపు 50 మంది లాయర్లు వాదించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ క్రమంలోనే ప్రశాంత్ పై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లను వదిలేది లేదంటూ వారిపై పరువు నష్టం దావా వేయడానికి పేపర్ ఫార్మేట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. అయితే ఈ విషయంపై ప్రశాంత్ ముందుగానే హెచ్చరించడం జరిగింది. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి , నోటికి వచ్చినట్లు మాట్లాడే వారి పేర్లను బయటపెడతా అని ప్రశాంత్ ముందే చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ యాంకర్ శివ పై పరువు నష్టం దావా వేస్తే మాత్రం శివకు కష్టాలు తప్పవని చెప్పాలి.