Naresh – pavitra lokesh : విజయనిర్మల స్వగ్రామంలోనే దుకాణం పెట్టేసిన నరేష్ – పవిత్ర… ఏంటి ఈ అరాచకం..

Naresh – pavitra lokesh : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా శాండిల్ వుడ్ లో కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నరేష్ పవిత్ర. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా సహజవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే . ఇక ఈ వార్తలు నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ జంటగా కలిసి వెళ్లడం ,ప్రతి కార్యక్రమంలో జంటగా పాల్గొనడం, అలాగే జంటగా ప్రత్యేక పూజలు చేయిస్తూ కనబడడంతో వీరు త్వరలోనే పెళ్లి […]

  • Published On:
Naresh – pavitra lokesh : విజయనిర్మల స్వగ్రామంలోనే దుకాణం పెట్టేసిన నరేష్ – పవిత్ర… ఏంటి ఈ అరాచకం..

Naresh – pavitra lokesh : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా శాండిల్ వుడ్ లో కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నరేష్ పవిత్ర. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా సహజవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే . ఇక ఈ వార్తలు నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ జంటగా కలిసి వెళ్లడం ,ప్రతి కార్యక్రమంలో జంటగా పాల్గొనడం, అలాగే జంటగా ప్రత్యేక పూజలు చేయిస్తూ కనబడడంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నట్లుగా ఒక వీడియోను కూడా కొన్ని రోజుల క్రితమే నిజంగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.

Naresh pavitra lokesh viral video..

ఆ వీడియో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇది కేవలం సినిమా కోసం చేసినట్లుగా ఒక సినిమా పోస్టును రిలీజ్ చేసి ఈ వార్తలకు చెక్ పెట్టారు. అయితే ఇంకా వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం నరేష్ మూడవ భార్య అయిన రమ్యా రఘుపతి ఇంకా నరేష్ కు విడాకులు ఇవ్వకపోవడం. రమ్య రఘుపతి నేనుండగా ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ నరేష్ తో గొడవకు దిగుతోంది. ఇది ఇలా ఉంటే నరేష్ ఏమో తన భార్య రమ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని కోర్ట్ లో కేసు పెట్టారు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు విజయనిర్మల స్వగ్రామంలో నరేష్ పవిత్రులు ప్రత్యేక పూజలు చేయిస్తూ మీడియా కంటపడ్డారు. నరేష్ తల్లి విజయనిర్మల స్వగ్రామం అయిన ఏలూరుపాడుకి నరేష్ పవిత్రని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Naresh pavitra lokesh viral video..

అంతేకాక పవిత్రతో కలిసి నరేష్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేసినట్లు సమాచారం. అయితే ఏలూరుపాడు లో వారి బంధువుల ఫంక్షన్ ఉండగా నరేష్ పవిత్రతో కలిసి అక్కడికి వచ్చారు. ఆమెతో కలిసి ఏలూరుపాడు లోని అమ్మవారి ఆలయాలను దర్శించి అనంతరం మహనీయులైన అల్లూరి సీతారామరాజు మరియు అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఇది ఇలా ఉండగా పవిత్ర లోకేష్ ని చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడానికి తన మూడో భార్య అయిన రమ్య రఘుపతికి విడాకులు నోటీసు పంపించగా ఆమె మాత్రం అంగీకారం ఇవ్వలేదు. అలాగే వీరిద్దరూ సహజీవనంపై పవిత్ర లోకేష్ భర్త ఆయన సుచిత్ర ప్రసాద్ కూడా ఘాటుగా స్పందించారు. అయినా కూడా వీరిద్దరూ అలాగే కలిసి తిరుగుతూ ఉన్నారు. మరి జంట వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో వెచి చూడాల్సిందే.