Naresh- Pavitra Lokesh : ఆకాశం మీద పడ్డా, భూమి బద్దలైనా మేము కలిసే ఉంటాం .. నరేష్ – పవిత్రల సీరియస్ కామెంట్స్ ..

Naresh- Pavitra Lokesh : నరేష్ పవిత్రల గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించారు. ఇప్పటికీ సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, తండ్రి పాత్రలను చేస్తూ వస్తున్నారు. అయితే వీళ్లకు విడిగా పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కానీ వీళ్ళిద్దరూ నాలుగేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. తాజాగా నరేష్ పవిత్ర లు కలిసి ‘ మళ్ళీ పెళ్లి […]

  • Published On:
Naresh- Pavitra Lokesh : ఆకాశం మీద పడ్డా, భూమి బద్దలైనా మేము కలిసే ఉంటాం .. నరేష్ – పవిత్రల సీరియస్ కామెంట్స్ ..

Naresh- Pavitra Lokesh : నరేష్ పవిత్రల గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించారు. ఇప్పటికీ సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, తండ్రి పాత్రలను చేస్తూ వస్తున్నారు. అయితే వీళ్లకు విడిగా పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కానీ వీళ్ళిద్దరూ నాలుగేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. తాజాగా నరేష్ పవిత్ర లు కలిసి ‘ మళ్ళీ పెళ్లి ‘ సినిమా చేశారు. ఈ సినిమా నరేష్ జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం.

naresh-pavitra-in-sixth-sense-reality-show

ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ తో నరేష్ ప్రేక్షకులకు సినిమాపై అవగాహన కల్పించారు. అయితే ఇది నా స్టోరీ కాదని ఆయన చెబుతున్నారు. కానీ అది నిజం కాదు. నరేష్ రమ్య రఘుపతి ని మూడో పెళ్లి చేసుకున్నారు. ఆమెతో నరేష్ కి మనస్పర్ధలు తలెత్తాయి. విడాకులు కావాలని నరేష్ వద్దని పవిత్ర లోకేష్ పిటీషన్ లు వేశారు. మళ్లీ పెళ్ళి సినిమా మే 26 న విడుదల కానుంది. కేవలం తెలుగు లోనే కాకుండా కన్నడ భాషలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ పవిత్ర సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోకి వచ్చారు. ఈ షోలో ఇద్దరు రొమాన్స్ కురిపించారు.

naresh-pavitra-in-sixth-sense-reality-show

మీరు పవిత్ర నీ ముద్దుగా ఏమని పిలుస్తారని ఓంకార్ నరేష్ నీ అడగ్గా ముద్దుగా అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ముద్దొస్తే అమ్ము అని పిలుస్తాను. ఇంకా ముద్దోస్తే .. వద్దులే చెప్పకూడదు అని అన్నారు. మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని అడగగా ఆకాశం మీద పడ్డా, భూమి బద్దలైన మేము కలిసే ఉంటామని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ముద్దుల్లో ముంచెత్తారు. అనంతరం కృష్ణ, విజయ నిర్మల గురించి మాట్లాడారు. వారిద్దరూ 24 గంటలు కలిసే ఉండేవాళ్ళు. అమ్మ మరణించాక ఆయన పక్కన చైర్ ఖాళీగా కనిపించేది. ఆయన లో అమ్మను చూసుకున్నాను. ఆయన కూడా మరణించారు. ఆ రెండు చైర్స్ ఖాళీగా కనిపిస్తుంటే చూసి తట్టుకోలేక పోయేవాడిని అని అన్నారు.