Mahesh Babu: విదేశాలకు ఒక్కడే వెళ్తున్న గౌతమ్ .. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నమ్రత ..

Mahesh Babu : ఒకప్పటి మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ తో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా టైంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తమ ఫ్యామిలీకు సంబంధించిన […]

  • Published On:
Mahesh Babu: విదేశాలకు ఒక్కడే వెళ్తున్న గౌతమ్ .. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నమ్రత ..

Mahesh Babu : ఒకప్పటి మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ తో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా టైంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తమ ఫ్యామిలీకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. మహేష్, గౌతమ్, సితార ల గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా నమ్రత సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ పోస్టల్ పెట్టారు. గౌతమ్ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. గౌతమ్ చదువుతోపాటు కల్చరల్ ఈవెంట్స్ లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాడు. తాజాగా వారి స్కూల్లో తొలి స్టేజి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు గౌతమ్ కల్చరల్ ఈవెంట్స్ కోసం విదేశాలకు వెళ్తున్నాడు. గౌతమ్ చిన్నప్పటినుంచి చాలాసార్లు చాలా విదేశాలకు వెళ్ళాడు. అయితే అప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ తన కల్చరల్ గ్రూప్ తో కలిసి విదేశాలకు వెళ్లనున్నాడు. దీంతో నమ్రత ఎమోషనల్ అయ్యారు. విదేశాలకు మొదటిసారి నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు అంటూ ఎమోషనల్ అయ్యారు.

మొదటిసారి ఒక్కడే కల్చరల్ ట్రిప్స్ కోసం విదేశాలకు వెళ్తున్నాడు. తను వెళ్తుంటే నాలోని సగభాగం నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ రోజంతా నాకు అలాగే ఉంది. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాను. తను మా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా కళ్ళముందుకు వచ్చేవరకు బాధగానే ఉంటుంది. గౌతమ్ పెద్దవాడు అయ్యాడు. ఇంటిని వదిలి ఒక్కడే వెళ్ళాడు. నీకు ఈ ట్రిప్ ఆనందంగా ఆహ్లాదకరంగా సాగాలని కోరుకుంటున్నాను అని ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Must Read : Biryani : కేవలం రూ.10 లకే వెజ్ బిర్యానీ .. ఎగబడుతున్న జనం ..