Finally-naga-chaithanya-ready-to-meet-samantha : ఒక్కటైన సామ్, చైతూ .. ఆ ఫోటోతో క్లారిటీ ..

Finally-naga-chaithanya-ready-to-meet-samantha: సమంత నాగచైతన్య గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. దీనికి కారణం వీళ్లు విడిపోవడమే. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా టైంలో ఇద్దరి మనుసులు కలిసాయి. పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.

  • Published On:
Finally-naga-chaithanya-ready-to-meet-samantha : ఒక్కటైన సామ్, చైతూ .. ఆ ఫోటోతో క్లారిటీ ..

Finally-naga-chaithanya-ready-to-meet-samantha: సమంత నాగచైతన్య గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. దీనికి కారణం వీళ్లు విడిపోవడమే. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా టైంలో ఇద్దరి మనుసులు కలిసాయి. పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటిఫుల్ జంటని చూసి అభిమానులు కూడా ఎంతో ఖుషి అయ్యారు. కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే ఇద్దరు విడాకులు తీసుకుని అందరకి షాక్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఇప్పటికి వీళ్లిద్దరూ కలిస్తే చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరు బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు.

ఇక రీసెంట్ గా సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. అయితే సమంత నాగచైతన్యలకు ఒకరిపై ఒకరికి ఇప్పటికి వాళ్ల మధ్య ప్రేమ ఉందని జనాలు భావిస్తున్నారు. దానికి కారణం రీసెంట్గా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన సమంత ను చూసి నాగచైతన్య చేసిన కామెంట్స్ తో తెలుస్తుంది. రీసెంట్గా సమంత మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి దక్షిణ కొరియా వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో ఆమె పిక్స్ చూసిన అభిమానులు బాధపడిపోయారు. సమంత బక్కగా, నీరసంగా అయిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సమంత పిక్స్ చూసిన నాగచైతన్య సమంత హెల్త్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా నాగచైతన్య సమంత హెల్త్ బాగోలేని కారణంగా ఆమెను పర్సనల్గా కలవడానికి ప్రయత్నిస్తున్నాడట. సమంత పిక్స్ చూసి తెగ బాధ పడిపోయాడంట చైతు. ఒక ఫ్రెండ్ లా తన హెల్త్ గురించి కేర్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. ఇలా అయినా వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే సమంత విడాకులు తర్వాత తన పూర్తి దృష్టి అంతా సినిమాల పైన పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక త్వరలోనే ‘ శాకుంతలం ‘ సినిమాతో రానుంది. ప్రస్తుతం ఖుషి సినిమా రెండో షెడ్యూల్లో పాల్గొంటుంది.

Must Read : Flipkart offers biggest discount on Sens Smart tv : రూ.1000 కడితే చాలు .. 55 ఇంచుల టీవీ మీ సొంతం ..