Cinema News : సినీ ఇండస్ట్రీలో దారుణం…గుండెపోటుతో మరణించిన ప్రముఖ నటి..

Cinema News  : తాజాకా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి గుండెపోటుతో మరణించడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాక మరణించే సమయానికి ఆమె 8 నెలల నిండు గర్భవతి కావడం మరింత బాధాకరమైన విషయం. ఈ నేపద్యంలోనే వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీశారు. దీంతో ఈ విషాద ఘటన సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటతడి పెట్టిస్తుంది. అయితే ప్రస్తుతం తల్లి గర్భం […]

  • Published On:
Cinema News : సినీ ఇండస్ట్రీలో దారుణం…గుండెపోటుతో మరణించిన ప్రముఖ నటి..

Cinema News  : తాజాకా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి గుండెపోటుతో మరణించడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాక మరణించే సమయానికి ఆమె 8 నెలల నిండు గర్భవతి కావడం మరింత బాధాకరమైన విషయం. ఈ నేపద్యంలోనే వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీశారు. దీంతో ఈ విషాద ఘటన సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటతడి పెట్టిస్తుంది. అయితే ప్రస్తుతం తల్లి గర్భం నుంచి వచ్చిన శిశువును ఐసీయూలో ఉంచారు. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే…

famous-actress-died-of-heart-attack

మలయాళం సీరియల్స్ లో చాలా యాక్టివ్ గా కనిపించే నటి డాక్టర్ ప్రియా ఇటీవల మరణించారు. ఇక ఆమె మరణ విషయాన్ని బుల్లితెర నటుడు కిషోర్ సత్య తన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.అయితే రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియాకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిందట. డాక్టర్లు వచ్చి పరీక్షించి అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్ధారించారు.ఈ నేపథ్యంలో ఆమె ఎనిమిది నెలల గర్భవతి కావడంతో ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. పూర్తి నెలలు నిండకపోవడంతో శిశువును ఐసీయూలో ఉంచినట్లుగా వైద్యులు తెలియజేశారు.

famous-actress-died-of-heart-attack

ఇది ఇలా ఉండగా మలయాళం సినీ మరియు సీరియల్ నటి రెంజూషా మీనన్ ( 35 ) ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. తిరువనంతపురంలోని ఆమె ప్లాట్ లోని ఉరివేసుకుని ఆత్మహత్యయ చేసుకుంది. ఈమె సీరియల్స్ లో లైన్ ప్రొడ్యూసర్ గా అలాగే దాదాపు 20 సీరియల్స్ పైగా నటించింది.ఇక ఈమె మరణానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలిసి రాలేదు. అయితే ఇలా వరుస మరణాలతో మలయాళం సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన బుల్లితెర నటుడు కిషోర్ సత్యా ,ప్రియ అనూహ్య మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kishor Satya (@kishor.satya)