Tirumala Tirupati : మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు తిరుపతి నుండి ఫ్రీగా…

Tirumala Tirupati : తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. అలాంటిది ఇక్కడ ప్రతి అంశాన్ని వారు ఎంతో సెంటిమెంట్ గా పవిత్రంగా భావిస్తారు. ఇక తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు ఆయనకు సంబంధించిన వస్తువులను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భక్తుల మనోభావాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని టీటీడీ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. తాజాగా ఒక విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక […]

  • Published On:
Tirumala Tirupati : మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు తిరుపతి నుండి ఫ్రీగా…

Tirumala Tirupati : తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. అలాంటిది ఇక్కడ ప్రతి అంశాన్ని వారు ఎంతో సెంటిమెంట్ గా పవిత్రంగా భావిస్తారు. ఇక తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు ఆయనకు సంబంధించిన వస్తువులను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భక్తుల మనోభావాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని టీటీడీ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. తాజాగా ఒక విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది శ్రీవారి మహిళా భక్తులకు శుభవార్త అని చెప్పాలి. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం తిరుమల తిరుపతి పాలకమండలి సమావేశం నిర్వహించింది. టీటీడీ చైర్మన్ భూవన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఇక ఈ మీటింగ్ లో టీటీడీ పలు కీలక నిర్ణయం తీసుకుంది. 5,141,74 లక్షల కోట్ల రూపాయలు టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసింది. ఇదే సమయంలో హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు లక్ష్మీ కాసులను భక్తులకు విక్రయించాలని టిటిడి నిర్ణయించింది. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. మహిళల కోసం మంగళ సూత్రాలను లక్ష్మీకాసులను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లాభపక్ష కాకుండా లేకుండా వీటిని విక్రయిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. హైందవ స్త్రీలకు ఈ మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు ఒక అమూల్యమైన కానుకగా పేర్కొన్నారు. ఇదే సమయంలో మరికొన్ని ఇతర అంశాలపైకి టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఉద్యోగుల స్థలాల్లో డామర్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం పలికింది.

అదేవిధంగా అబ్దుల్లా ట్రైన్ మోసే కార్మికుల వేతనాలకి 15 వేల రూపాయలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలానే వేద పాఠశాలలో 51 మంది , సంభావన గురువులకు జీత 34,000 నుంచి 54 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యం లో నడుస్తున్న 60 దేవాలయాల లో పనిచేసేందుకు నూతనంగా పనిచేయుటకు పోస్టులను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సమావేశంలో కిమ్స్ ఆస్పత్రిలో 33 వందల పడకల పెంపు 108 కోట్ల టెండర్ కి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ సత్రాల్లో అభివృద్ధి పనులకి రెండు కోట్ల 50 లక్షల రూపాయలు కేటాయించారు. హెచ్ఎంసీతోపాటు పలు భూకాటేజీల ఆవిష్కరణకు 10 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అన్నమయ్య భవన అభివృద్ధి కి 47 లక్షల రూపాయల కేటాయించారు. 30 కోట్ల రూపాయలతో భూమి గర్భం నుండి ఆకాశగంగా వరకు నాలుగు వరసల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.