Minister Roja : తిరుమలలో మంత్రి రోజాకు ఘోర అవమానం…

Minister Roja  : మంత్రి రోజాకు అనూహ్య ఘటన ఎదురైంది. తిరుమల వేదికగా అమరావతి నినాదాలు వినిపించాయి. అయితే తాజాగా మంత్రి రోజా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి బయటికి వచ్చిన సమయంలో శ్రీవారి సేవకులుగా ఉన్న కొందరు అమరావతి అనుకూల నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ నిలదించాలి అంటూ రోజా ను శ్రీవారి సేవకులు కోరారు. దీనితో షాక్ అయిన రోజా శ్రీవారి సేవకు అని వచ్చి ఇదేంటి […]

  • Published On:
Minister Roja : తిరుమలలో మంత్రి రోజాకు ఘోర అవమానం…

Minister Roja  : మంత్రి రోజాకు అనూహ్య ఘటన ఎదురైంది. తిరుమల వేదికగా అమరావతి నినాదాలు వినిపించాయి. అయితే తాజాగా మంత్రి రోజా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి బయటికి వచ్చిన సమయంలో శ్రీవారి సేవకులుగా ఉన్న కొందరు అమరావతి అనుకూల నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ నిలదించాలి అంటూ రోజా ను శ్రీవారి సేవకులు కోరారు. దీనితో షాక్ అయిన రోజా శ్రీవారి సేవకు అని వచ్చి ఇదేంటి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏపీలో ఎన్నికల వేల తిరుమల లో అమరావతి అనుకూల నినాదాలతో మంత్రి రోజాను అడుక్కునే ప్రయత్నం జరిగింది. మంత్రి రోజా తరచు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మంత్రి రోజాకు ఈ చేదు అనుభవం ఎదురయింది.

స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయ వెలువలకు వచ్చిన రోజా జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు కోరారు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అంటూ మంత్రి రోజా వెళ్లిపోయారు. అయితే శ్రీవారి సేవకులుగా ఉంటూ ఆలయ సమీపంలో ఆ నినాదాల పైన అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీవారి సేవకులుగా అమరావతి ప్రాంతానికి చెందిన వారు ఈ నినాదాలు చేసినట్లు చెప్తున్నారు. ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల వ్యవహారం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ వివాదం పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఎన్నికలవేళ మూడు రాజధాని ల వ్యవహారం రాజకీయ అంశంగా కనిపిస్తుంది. అయితే అనూహ్యంగా తిరుమల వేదికగా అమరావతి నినాదాలు చేయడంతో మరోసారి ఈ అంశం వివాదస్పందంగా మారబోతుంది. దీనిపైన టిటిడి అధికారులు స్పందించాల్సి ఉంది.