Ramajogayya Sastry : తమన్ సాంగ్ ట్రోలింగ్…రామజోగయ్య శాస్త్రి సీరియస్…

Ramajogayya Sastry : త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుండి తాజాగా ఓ మై బేబీ లిరికల్ సాంగ్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట విడుదలైన అనంతరం సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పాటకు సాహిత్యం అందించిన రామ జోగయ్య శాస్త్రి పై ఎన్నో రకాలుగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు […]

  • Published On:
Ramajogayya Sastry : తమన్ సాంగ్ ట్రోలింగ్…రామజోగయ్య శాస్త్రి సీరియస్…

Ramajogayya Sastry : త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుండి తాజాగా ఓ మై బేబీ లిరికల్ సాంగ్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట విడుదలైన అనంతరం సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పాటకు సాహిత్యం అందించిన రామ జోగయ్య శాస్త్రి పై ఎన్నో రకాలుగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ పాటపై తమన్ ని మరియు రామ్ జోగయ్య శాస్త్రిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే సినిమాపై మితిమీరిన అంచనాలు ఉండడంతో ఇలా జరిగిందా….? లేక అవుట్ పుట్ తేడా కొట్టిందా…?అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరికొందరైతే అసభ్య పదజాలంతో రామ జోగయ్య శాస్త్రి పై విపరీతంగా ట్రోలింగ్స్ చేయడంతో స్వయంగా రామజోగయ్య శాస్త్రి తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ….

గుంటూరు కారం సాంగ్‌పై ట్రోలింగ్‌.. 'ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి' | Ramajogayya  Sastry Fires On Oh My Baby Song Trolling - Sakshi

” ప్రతివాడు మాట్లాడేవాడు… రాయి విసిరేవాడు… అభిప్రాయం చెప్పడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువ అయిందని.. మీ కన్నా ఎక్కువ ప్రేమే మాకు కూడా….అదే లేకపోతే….ప్రేమించకపోతే… మా పని మేము గొప్పగా చేయలేం…కాబట్టి తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి…” అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి చేసిన ట్విట్ సోషల్ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ పాట ట్రోలింగ్ పై ఇప్పటివరకు తమన్ స్పందించలేదు. అయితే తమన్ పాటలపై ట్రోలింగ్ జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు తమన్ అందించిన సంగీతానికి ట్రోలింగ్ వచ్చాయి. ఇక ఇప్పుడు గుంటూరు కారం సాంగ్స్ విషయంలో తమన్ ను ట్రోల్ చేయడానికి ఒక బలమైన కారణమే ఉందని చెప్పాలి.

అయితే మహేష్ బాబు గత చిత్రం “సర్కారు వారిపాట” సినిమాకు తమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ అందించలేకపోయారు. ఆ సినిమాలో ఒక కళావతి సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. అలాగే సినిమాలోని బిజిఎం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి గుంటూరు కారం సినిమాలో అలాంటి మిస్టేక్స్ చేయకూడదని ఫ్యాన్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే గుంటూరు కారం సాంగ్స్ లో ఏ చిన్న తప్పు ఉన్న వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక గుంటూరు కారం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెలాఖరులోపు వాటిని కూడా విడుదల చేసేందుకు సినీ బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ పాటలకు సోషల్ మీడియాలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.