Chiranjeevi : త్వరలోనే మరో ఇల్లు కట్టుకోబోతున్న చిరంజీవి .. ఎక్కడో తెలుసా ?

Chiranjeevi :ఈసారి సంక్రాంతి కానుకగా భారీ సినిమాలు బరిలోకి దిగనున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లు ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు.

  • Published On:
Chiranjeevi : త్వరలోనే మరో ఇల్లు కట్టుకోబోతున్న చిరంజీవి .. ఎక్కడో తెలుసా ?

Chiranjeevi :ఈసారి సంక్రాంతి కానుకగా భారీ సినిమాలు బరిలోకి దిగనున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లు ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు. బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే విశాఖపట్నంలో ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది అభిమానులు హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి మాట్లాడుతూ విశాఖపట్నం అన్నా.. అక్కడి జనాలు అన్న నాకెంతో ఇష్టం. వైజాగ్ మనుషులు శాంతంగా ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు తెలియని మంచి మనుషులు. ఎంతో సరదాగా ఉంటారు హుందాగా ప్రవర్తిస్తారు. బాధ్యతల నుంచి బయటపడిన తర్వాత విశాఖపట్నంలో ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా జీవిస్తాను. ఇన్నాళ్లు ఇక్కడ సెటిల్ కావాలని చెబుతుండే వాడిని కానీ ఇప్పుడు భీమిలి వెళ్లే దారిలో ప్లేస్ కొన్నాను. త్వరలోనే ఇల్లు కట్టాలి. అది నా చిరకాల కోరిక అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా కథ వినగానే వాల్తేరు అనే పేరు ఉన్నప్పుడు నాకు మంచి ఫీలింగ్ వచ్చింది. డైరెక్టర్ బాబీ కథ చెప్పడానికి గంటన్నర సమయం తీసుకున్నాడు. కథ బాగా అనిపించింది వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చాను. సినిమా నాకు ఓకే అని చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే చేసిన కథలన్నీ ఇప్పటిదాకా అన్ని సక్సెస్ అయ్యాయి. ఆ నమ్మకంతోనే చెబుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక చిరంజీవి విశాఖపట్నం పై చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నిజంగానే చిరంజీవి త్వరలోనే విశాఖలో ఇల్లు కట్టుకుంటాడని తెలుస్తోంది.

Must Read: Tamanna : బీచ్ లో తమన్నా ఏం చేసిందో తెలిస్తే ‘ హవ్వా ‘ అంటారు ..