Asian Games 2023 : స్వర్ణం సాధించి ఒలంపిక్ బాట పట్టిన భారత్ హాకీ టీం…
Asian Games 2023 : భారత మెన్స్ హాకీ టీం ఆసియా క్రీడలు 2022లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్ ఫైనల్లో జపాన్ తో పోటీ పడిన భారత్ 5-1 తో నాలుగోసారి ఆసియా స్వర్ణ పథకాన్ని దక్కించుకుంది. దీంతో కోచ్ క్రేన్ ఫుల్ టౌన్ బృందం 2024 ఒలంపిక్స్ అర్హత సాధించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఇది 22వ స్వర్ణ పథకం. అయితే 2018లో హాకీ క్రీడలో జపాన్ […]
![Asian Games 2023 : స్వర్ణం సాధించి ఒలంపిక్ బాట పట్టిన భారత్ హాకీ టీం…](https://telugutopnews.com/wp-content/uploads/2023/10/Untitled-2-3.jpg)
![Asian Games 2023 : స్వర్ణం సాధించి ఒలంపిక్ బాట పట్టిన భారత్ హాకీ టీం…](https://telugutopnews.com/wp-content/uploads/2023/10/Untitled-2-3.jpg)
Asian Games 2023 : భారత మెన్స్ హాకీ టీం ఆసియా క్రీడలు 2022లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్ ఫైనల్లో జపాన్ తో పోటీ పడిన భారత్ 5-1 తో నాలుగోసారి ఆసియా స్వర్ణ పథకాన్ని దక్కించుకుంది. దీంతో కోచ్ క్రేన్ ఫుల్ టౌన్ బృందం 2024 ఒలంపిక్స్ అర్హత సాధించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఇది 22వ స్వర్ణ పథకం. అయితే 2018లో హాకీ క్రీడలో జపాన్ స్వర్ణ పథకాన్ని గెలుచుకోగా భారత్ కాంస్య పథకంతో సరిపెట్టుకుంది.
ఇక ఇప్పుడు భారత్ స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. ఇక ఈ క్రీడలో భారత్ తరపున మన్ ప్రీత్ సింగ్ 25 వ నిమిషంలో , అర్మాన్ ప్రీత్ సింగ్32 మరియు 59 వ నిమిషంలో , అమిత్ రోహిదాస్ 36వ నిమిషం , అభిషేక్ 48వ నిమిషాలలో గోల్స్ సాధించారు. ఇక జపాన్ తరఫున తనక 51 నిమిషంలో కేవలం ఒకే ఒక గోల్ ను అందించాడు. దీంతో ఈసారి భారత్ 1 స్వర్ణం 2 రజతం, 6 కాంస్య పథకాలతో మొత్తం ఎనిమిది పథకాలను సాధించింది. దీంతో ఆసియా క్రీడలలో భారత్ కు మొత్తం పథకాల సంఖ్య 95 కు చేరింది.
🇮🇳 𝟓-𝟏 🇯🇵
𝐆𝐎𝐋𝐃 🥇 𝐌𝐞𝐝𝐚𝐥 𝐅𝐨𝐫 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳#𝐓𝐞𝐚𝐦𝐈𝐧𝐝𝐢𝐚 𝐛𝐞𝐚𝐭 𝐉𝐚𝐩𝐚𝐧 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐅𝐈𝐍𝐀𝐋 𝐨𝐟 #𝐀𝐬𝐢𝐚𝐧𝐆𝐚𝐦𝐞𝐬𝟐𝟎𝟐𝟐 🏑 pic.twitter.com/SYFyDZ3kod
— Doordarshan Sports (@ddsportschannel) October 6, 2023
భారత్ కు 100 పథకాలు….
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈసారి 100 పథకాల సంఖ్యను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 95 పథకాలు భారత్ ఖాతాలో ఉండగా తాజాగా శుక్రవారం రోజు మరో ఏడు పథకాలు భారత్ కు లభించాయి. దీంతో ప్రస్తుతం 100 పైగా పథకాలను భారత్ సాధించి నాలుగు స్థానంలో నిలిచింది.