Asia Cup 2022: టీమిండియాకి రెండో ఓవర్లోనే అసలైన దెబ్బ ! కాని ఎవరు చూడలేదు !!!

Asia Cup 2022: టీమిండియాకి రెండో ఓవర్లోనే అసలైన దెబ్బ ! కాని ఎవరు చూడలేదు !!! ఆసియా కప్‌ టైటిల్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. గ్రూప్‌ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో అందుకు తగ్గట్లు అదరగొట్టింది. గ్రూప్‌ ఏ నుంచి పాక్‌, హాంకాంగ్‌ను ఓడించి.. టీమిండియా సూపర్‌ ఫోర్‌కు చేరింది కానీ సూపర్‌ ఫోర్‌లో దారుణమైన ప్రదర్శనను కనబరుస్తోంది. ఆదివారం ఎలా అయితే మిడిల్డార్‌ వైఫల్యం, ఫేలవ బౌలింగ్‌తో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో […]

  • Published On:
Asia Cup 2022: టీమిండియాకి రెండో ఓవర్లోనే అసలైన దెబ్బ ! కాని ఎవరు చూడలేదు !!!

Asia Cup 2022: టీమిండియాకి రెండో ఓవర్లోనే అసలైన దెబ్బ ! కాని ఎవరు చూడలేదు !!!

ఆసియా కప్‌ టైటిల్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. గ్రూప్‌ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో అందుకు తగ్గట్లు అదరగొట్టింది. గ్రూప్‌ ఏ నుంచి పాక్‌, హాంకాంగ్‌ను ఓడించి.. టీమిండియా సూపర్‌ ఫోర్‌కు చేరింది కానీ సూపర్‌ ఫోర్‌లో దారుణమైన ప్రదర్శనను కనబరుస్తోంది. ఆదివారం ఎలా అయితే మిడిల్డార్‌ వైఫల్యం, ఫేలవ బౌలింగ్‌తో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిందో.. అవే తప్పిదాలతో శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం మూటగట్టుకుంది. టీమిండియాకు ఈ ఓటమితో ఆసియా కప్‌ ఫైనల్‌ అవకాశాలు దాదాపు దూరమైనట్లే.

పాకిస్థాన్‌ తదుపరి రెండు మ్యాచ్‌లు ఓడి, టీమిండియా భారీ తేడాతో అఫ్ఘనిస్థాన్‌పై గెలిస్తే గానీ.. ఫైనల్‌ చేరే ఛాన్స్‌ లేదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి వస్తుందని అవగాహన ఉన్నా.. శ్రీలంకతో ఆడుతున్నది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ అని తెలిసినా కూడా టీమిండియా కొన్ని అనవసరమైన తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. మొదటగా టాస్‌ ఓడిపోవడం ఒక దురదృష్టమైతే.. చేజేతులా టీమిండియా ఆటగాళ్లు చేసిన తప్పులు కూడా శ్రీలంకపై ఓటమికి కారణంగా చెప్పవచ్చు​.

ఆ ఒక్క రనౌట్‌తో మ్యాచ్‌ మనదే అయ్యేది..

టాస్ ఓడిపోయిన టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేసి శ్రీలంకకు 174 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా సరే.. టీమిండియా లాంటి టీమ్‌పై 174 పరుగుల టార్గెట్‌ చేజ్‌ చేయడం అంత ఈజీ కాదనే ప్రెషర్‌ శ్రీలంక బ్యాటర్ల బ్యాటింగ్ లో కనిపించింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్ల బ్యాటింగ్ లో ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. తొలి ఓవర్‌ కట్టుదిట్టంగా వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ కేవలం ఒకే ఒక రన్‌ ఇచ్చాడు.

అలాగే అర్షదీప్‌ సింగ్‌ రెండో ఓవర్‌ వేసిన తొలి ఐదు బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి శ్రీలంక ఓపెనర్లపై మరింత ప్రెషర్‌ పెంచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎక్కువ పరుగులు రాకపోవడంతో.. శ్రీలంక ఓపెనర్లు ఒత్తిడికి గురయ్యారు. కుషల్ మెండిస్‌ రెండో ఓవర్‌ ఐదో బంతిని మిడ్‌ఆన్‌ వైపు ఆడి సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి మిడ్‌ఆన్‌ లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ చేతుల్లోకి నేరుగా వెళ్లింది.

చదవండి: తుపాకీతో బెదిరించి అసహజ రీతిలో కోరిక తీర్చకుంటున్న భర్త! ఆ పని ఏంటో తెలుసా ?

మెండిస్‌ అయినా కూడా రన్‌ కోసం రిస్క్‌ చేశాడు. రాహుల్‌ వెంటనే బంతిని అందుకుని మెరుపువేగంతో బౌలర్‌ ఎండ్‌ వైపు
ఉన్న వికెట్లకు త్రో విసిరాడు. కానీ.. ఆ త్రో మిస్‌ అయింది అలాగే ఒత్తిడిలో పరుగులు రావడం లేదని లేని పరుగు కోసం ప్రయత్నించిన మెండిస్‌ రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక శ్రీలంక ఓపెనర్లు ఇక్కడి నుంచి టీమిండియాకు ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. పవర్‌ ప్లేలో రెండు ఓవర్లు వరకు డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ కూడా చేయలేని లంక ఓపెనర్లు మెండిస్‌, నిస్సంకా.. రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకొని మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశారు.

కాని కేఎల్‌ రాహుల్‌ కనుక ఆ త్రోను ఫర్ఫెక్ట్‌గా కొట్టి ఉంటే కచ్చితంగా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఆ సమయంలో ఫామ్‌లో ఉన్న మెండిస్‌ వికెట్‌ కోల్పోయి ఉంటే అప్పటికే పరుగులు రాని ఒత్తిడిలో ఉన్న శ్రీలంక.. కచ్చితంగా ఆత్మరక్షణలో పడేది. దీనివల్ల శ్రీలంక బ్యాటర్లు పవర్‌ప్లేలో టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగేవారు కాదు.

చదవండి:

రాహుల్‌ ఇచ్చిన లైఫ్‌ను మెండిస్‌ పూర్తిగా ఉపయోగించుకొని హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్‌ నిస్సంకా కూడా అతనితో పాటు హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్‌ను శ్రీలంక వైపు తిప్పుకున్నారు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో యుజ్వేంద్ర చాహల్‌ ద్వార.. టీమిండియాకు తొలి వికెట్‌ లభించింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఇదే వికెట్‌ దొరికి ఉంటే టీమిండియా మరింత పట్టుబిగించి, మ్యాచ్ స్వరూపం మార్చేసేది.

ఓపెనర్లు ఇద్దరూ అవుటైన యుజ్వేంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టి.. వికెట్లు తీసి మ్యాచ్‌ను చివరి ఓవర్‌ వరకు తీసుకెళ్లారు. కానీ.. 19వ ఓవర్‌ను భువనేశ్వర్‌ కుమార్‌కు ఇచ్చి పాక్‌తో మ్యాచ్‌లో చేసిన తప్పే మళ్లీ చేశాడు రోహిత్‌ శర్మ. 12 బంతుల్లో 21 రన్స్‌ డిఫెండ్‌ చేయాల్సిన సమయంలో 19వ ఓవర్‌ వేసిన భువీ ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో శ్రీలంక విజయం లాంఛనమైంది.

చదవండి:భార్య పార్ట్ లోకి ఫెవిక్విక్ ను జొప్పించి రాక్షసానందం పొందిన భర్త! తర్వాత ఎం జరిగిందో తెలుసా ???

కానీ చివరి ఓవర్‌లో కేవలం 7 పరుగులను సైతం డిఫెండ్‌ చేసేందుకు టీమిండియా యువ బౌలర్‌ అర్షదీప్‌ శాయశక్తుల కృషి చేశాడు. తొలి రెండు బంతులకు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడో బంతికి భానుక రాజపక్సా రెండు పరుగులు తీశాడు. నాలుగో బంతికి మళ్లీ సింగిల్‌ మాత్రమే ఇచ్చి అర్షదీప్‌ శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇదే అదునుగా ఐదో బాల్‌ను సైతం అద్భుతంగా వేయడంతో బ్యాటర్‌ దాన్ని మిస్‌ అయ్యాడు. బంతి కీపర్‌ చేతుల్లోకి వెళ్తుండగా.. రాజపక్సా పరుగు కోసం వెళ్లాడు. కానీ.. పంత్‌ వికెట్లకు త్రో వేయడంలో విఫలం అయ్యాడు.

ఆ బంతి బౌలర్‌ అర్షదీప్‌ చేతుల్లో పడింది. అతను నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు త్రో కొడితే అది కూడా మిస్‌ అయింది. ఓవర్‌ త్రోతో మరో సింగిల్‌ వచ్చింది. పంత్‌ తప్పిదంతో డాట్‌ బాల్‌కు అనవసరంగా రెండు పరుగులు రావడంతో శ్రీలంక 174 టార్గెట్‌కు రీచ్‌ అయింది. కానీ.. శ్రీలంక ఇన్నింగ్స్‌ ఆరంభంలో కేఎల్‌ రాహుల్‌ సరిగ్గా త్రో కొట్టి ఉంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచేది. ఆ ఒక్క మిస్‌ త్రో టీమిండియాకు మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌ను దూరం చేసిందని చెప్పవచ్చు. మరి కేఎల్‌ రాహుల్‌ మిస్‌ త్రోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.