Ola Electric Scooter : కస్టమర్లకు 130 కోట్లు రిఫండ్ ఇవ్వబోతున్న ఓలా కంపెనీ… దేనికంటే….?
Ola Electric Scooter : 2019 – 20 ఆర్థిక సంవత్సరం నుండి మార్చి 30 – 2023 వరకు ఓలా S1pro మోడల్ స్కూటర్ను కొనుగోలు చేసిన వారి నుండి వసూలు చేసిన ఆన్ బోర్డ్ చార్జీలను కంపెనీ తిరిగి వినియోగదారులకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ధర విషయంలో పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విచారణ పై ద్విచక్ర వాహన కంపెనీ స్పందిస్తూ…తాజా చర్యలను తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం విచారణ మరియు సబ్సిడీల సస్పెన్షన్ గురించి […]
Ola Electric Scooter : 2019 – 20 ఆర్థిక సంవత్సరం నుండి మార్చి 30 – 2023 వరకు ఓలా S1pro మోడల్ స్కూటర్ను కొనుగోలు చేసిన వారి నుండి వసూలు చేసిన ఆన్ బోర్డ్ చార్జీలను కంపెనీ తిరిగి వినియోగదారులకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ధర విషయంలో పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విచారణ పై ద్విచక్ర వాహన కంపెనీ స్పందిస్తూ…తాజా చర్యలను తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం విచారణ మరియు సబ్సిడీల సస్పెన్షన్ గురించి కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రభుత్వం ఏం చేయమన్న కంపెనీ కచ్చితంగా చేస్తుందని ఆయన తెలియజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.అయితే ముందుగా కేంద్ర ప్రభుత్వం రెండు ఈ.వీ కంపెనీలకు అందించిన రూ.249 కోట్ల సబ్సిడీలను రికవరీ చేయాల్సిందిగా నిర్ణయం తీసుకుంది. దీనిలో మొదటిది ఓకినావా ఆటోటెక్ నుండి రూ.116 కోట్లు హీరో మోటార్స్ నుండి రూ.133 కోట్లు వసూలు చేస్తున్నట్లు అంచనా.
అయితే ఈ కంపెనీలు FAME ఇండియా స్కీమ్ పేజ్ ll కింద సబ్సిడీలను దుర్వినియోగం చేశారట. దీంతో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు రావడంతో చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టేందుకు మంత్రిత్వ శాఖ ఏజెన్సీలను నియమించడం జరిగింది.ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓలా తమ కస్టమర్లకు దాదాపుగా రూ.130 కోట్లను తిరిగి చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈవీ చార్జెస్ ను , కొనుగోడు చేసిన ప్రతి వినియోగదారునికి ఈ మొత్తం అందనున్నట్లు సమాచారం.