Breaking News : బోరబండ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి టెలి కాలర్ గా పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమెకు మహారాష్ట్రకు చెందిన సైఫ్ అనే వ్యక్తితో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు మహారాష్ట్ర నుంచి ఆమె కోసం హైదరాబాద్ వచ్చాడు. సైఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నాళ్లపాటు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే 2020లో ఆ యువతికి కుటుంబ సభ్యులు మరో వివాహం చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ యువతి దుబాయ్ కి వెళ్ళిపోయింది.
ఈ సమయంలోనే సైఫ్ మళ్లీ ఆమె కాంటాక్ట్ లోకి వచ్చాడు. భర్తకు విడాకులు ఇచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో సైఫ్ మాటలు నమ్మిన ఆ యువతి ముందు వెనక ఆలోచించకుండా భర్తను వదిలేసి హైదరాబాద్ కు వచ్చింది. అనంతరం ఆమెకు గర్భస్రావం కూడా చేయించాడు. ఇలా కొంతకాలం కలిసి ఉండి తన సొంత ఊరుకు వెళ్ళిపోయాడు సైఫ్. ఈనెల 22న మరొక యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయవతి సైఫ్ స్వగ్రామానికి వెళ్లి నిలదీసింది.
సైఫ్ అందుకు నిరాకరించాడు. సైఫ్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా ఆమెపై మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఏం చేయలేని ఆ యువతి తిరిగి హైదరాబాద్ కు వచ్చింది. సైఫ్ పై ఎస్సార్ నగర్లో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనం నిత్యం టీవీ, న్యూస్ పేపర్లలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. చాలామంది సోషల్ మీడియా ద్వారా పరిచయమై ఆ తర్వాత ప్రేమతో ఒకటై దారుణంగా మోసపోతున్నారు. అయినా ఏమాత్రం అప్డేట్ కాకుండా అంతే మోసపోతున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More