Bandla Ganesh : టాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ అప్పుడప్పుడు ఆయన నోటి దూలతో కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. దీంతో నెటిజన్స్ కూడా అదే రేంజ్ లో బండ్ల గణేష్ ని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో పార్టీ నేతలు బాలకృష్ణ , విజయ సాయి రెడ్డిలను పరామర్శించారు. అయితే ఇలాంటి సందర్భంలో బండ్ల గణేష్ ఆలోచనారహితంగా వ్యాఖ్యలు చేశాడు. తారకరత్న కుటుంబానికి ఇటు టిడిపి తో పాటు వైసిపి మధ్య విడదీయరాని బంధం ఉంది.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి వైసీపీ మంత్రి విజయసాయిరెడ్డికి దగ్గరి బంధువు. తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అయితే తారకరత్నకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చారు. తారకరత్నకు నివాళులు అర్పించిన తర్వాత విజయసాయి రెడ్డితో కాసేపు కూర్చొని మాట్లాడారు. ఇలా వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసి నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి ఫోటోలను ట్వీట్ చేస్తూ .. నా ప్రాణం పోయినా నా శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చుని మాట్లాడను
అవసరమైతే అక్కడినుంచి లేచి వెళ్తాను, అది నా నైజం.. జనంలో నమ్మకం కోల్పోవడానికి ఇదే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చావాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో బండ్ల గణేష్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు. ఇక్కడ విజయసాయి, చంద్రబాబు కలిసిన సందర్భం వేరు. ఇంటికి వచ్చిన వ్యక్తి శత్రువైనా సరే మంచినీళ్లు ఇచ్చి పలకరించే సాంప్రదాయం మనది. ఇలాంటి కష్ట సమయంలో పార్టీలను పక్కనపెట్టి, వారంతా తారకరత్న కుటుంబానికి అండగా నిలిచారు. దీన్ని కూడా రాజకీయం చేయాలా .. జనాలు మరి అంత పిచ్చివాళ్లు కాదు, నువ్వు నీ పిచ్చి ట్వీట్స్ అంటూ బండ్ల గణేష్ పై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More