KCR : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాజాగా కృష్ణ ప్రాజెక్టులను KRMB కి అప్పగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టులపై బిఆర్ఎస్ మధ్య మరియు కాంగ్రెస్ మధ్య డైలాగ్ వారు నడుస్తుంది. ఇక ఇదే అంశంపై నల్లగొండలో ఫిబ్రవరి 3వ తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ భారీ బహిరంగ సభ ద్వారా కెసిఆర్ కూడా రి ఎంట్రీ ఇవనున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ బహిరంగ సభ 2 లక్షల మందితో బిఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసిందని సమాచారం.ఇలాంటి తరుణంలో నల్గొండ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ 1861 , సెక్షన్ 30 ,30a అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఎస్పీ చందన దీప్తి ప్రకటన కూడా విడుదల చేశారు.ఇక ఈ చట్టం ప్రకారం పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని వారు తెలియజేశారు. అయితే బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకువచ్చిందని బిఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. భారీ బహిరంగ సభను కచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పుకొస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More