Tollywood Top Disasters : గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాల బిజినెస్ విపరీతంగా పెరిగింది. దీంతో స్టార్ హీరోల మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో చాలా సినిమాలు విడుదలకు ముందే వందల కోట్లలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను నిర్వహిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని చిత్రాలు మాత్రమే అంచనాలకు తగినట్లు బాక్సాఫీస్ దగ్గర పైసా వసూల్ చేస్తున్నాయి. కానీ నెగటివ్ టాక్ వచ్చింది అంటే అంత సంగతులు. ఘోరంగా నష్టపోవాల్సి ఉంటుంది.
గతేడాది ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ భారీ డిజాస్టర్ తో నష్టాన్ని మిగిల్చింది. ఇక తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా కూడా అనుకున్నంత అంచనాలను అందుకోలేకపోయింది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇటీవల సమంతా నటించిన శాకుంతలం ఆల్ టైం బిగ్గేస్ట్ డిజాస్టర్ గా రికార్డ్ సృష్టించింది. ఇలా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు డిజాస్టర్ గా కావడం గత కొన్నేళ్లుగా చాలానే చూస్తున్నాం.. అయితే గత దశాబ్ద కాలంలో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ గా నిలిచిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 202 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్లు రాబట్టాల్సి ఉంది. అలాగే హిందీలో 52 కోట్లు హిందీలో అమ్మారు.
కానీ రాదే శ్యామ్ ఈ లక్ష్యానికి 120 కోట్ల దూరంలో ఆగిపోయింది.. దీంతో టాలీవుడ్ లో ఇప్పటివరకు డిజాస్టర్ గా ఉన్న రికార్డులను బ్రేక్ చేసి అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి మరియు కొడుకు రామ్ చరణ్ తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటించిన సినిమా ఆచార్య. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల కు పైగా స్క్రీన్ లో విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా 84.14 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . దీంతో 2022 లో రాదే శ్యామ్ తర్వాత ఆచార్య సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి మూవీ 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా 123.60 కోట్లకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ విడుదల తర్వాత 66.10 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా భారి అంచనాలతో తెరకెక్కింది. కానీ విడుదల తర్వాత భారీ డిజాస్టర్ ను సొంతం చేస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో నటించిన స్పైడర్ మూవీ 120 కోట్ల బడ్జెట్ తో తరికెక్కింది. కానీ విడుదల తర్వాత ఈ సినిమా 60.50 కోట్ల నష్టాన్ని నిలిచింది.
బాహుబలి సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సాహో 350 కోట్ల బడ్జెట్ తో తెరకేకింది. కానీ విడుదల తర్వాత ఈ సినిమా 52.15 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
సమంత హీరోయిన్ గ నటించిన శాకుంతలం సినిమా ఇటివల భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ఏ మాత్రం అలరించలేకపోయింది. ప్రతి సినిమా 65 కోట్లు బడ్జెట్ తో తరకెక్కించగా… దాదాపుగా 45 కోట్ల వరకు నష్టాలను తీసుకువచ్చినట్లు సమాచారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో తర్కెక్కిన నేనొక్కడినే-1 మూవీ విడుదల తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More