Ram Mandir : అయోధ్యలో కొత్త దోపిడీ…రాముని పేరు తో కొత్త దందా…

Ram Mandir  : ఇటీవల ప్రారంభించిన అయోధ్య బాల రాముని ఆలయంలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ స్థాయిలో రేట్లు ఫిక్స్ చేసి విక్రయిస్తూ కొన్ని హోటల్స్ కస్టమర్లను నిండా ముంచేస్తున్నాయి. బాల రాముని ఆలయ ప్రాంగణంలో మంచి సేవలు అందించాల్సింది పోయి వారి స్వలాభాన్ని చూసుకుంటూ కస్టమర్లను ముంచేసే ప్రయత్నాలు , వారిని నాన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయినప్పటినుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి అందరికీ తెలిసిందేే. ఈ క్రమంలో ఇదే అదునుగా భావించిన కొన్ని రెస్టారెంట్లు వారి హోటల్లోని ఆహార పదార్థాలకు భారీగా రేట్లు పెంచేశారు. ఈ క్రమంలో ఒక రెస్టారెంట్ చేసిన నిర్వాహకం చూస్తే ఎవరైనా సరే నోరేళ్లపెట్టాల్సిందే…

అయితే ఆ రెస్టారెంట్ పేరు శబరి రసోయి. బాల రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ రెస్టారెంట్ ని కొత్తగా ప్రారంభించడం జరిగింది.అయితే ప్రస్తుతం బాల రాముని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు కాబట్టి ఇక్కడ హోటల్ ప్రారంభిస్తే బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఉద్దేశంతో రెస్టారెంట్ ను ఇక్కడ స్థాపించారు. అయితే వారు భావించినట్లుగానే కస్టమర్లు అధిక సంఖ్యలో రావడం చూసిన రెస్టారెంట్ యాజమాన్యం మరింత కక్కుర్తి పడి ధరలను అమాంతం పెంచేసింది. ఈ క్రమంలోనే పది రూపాయలకి అమ్మాల్సిన టీ ధరను ఏకంగా 55 రూపాయలకు పెంచేశారు. అదేవిధంగా ఒక్కొక్క పాట్ ధరను 65గా కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆ రెస్టారెంట్ కి వెళ్ళిన ఒక కస్టమర్ రెండు టీలు రెండు పోట్స్ ఆర్డర్ చేయగా అతని దగ్గర నుండి జీఎస్టీతో కలిపి మొత్తం 252 రూపాయలను హోటల్ యాజమాన్యం తీసుకున్నారు.

ఇక ఈ బిల్లు చూసి కంగుతున్న సదరు కస్టమర్ ఇదేంటని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. అయితే హోటల్ యాజమాన్యం మాత్రం ఇక్కడ ఇలాగే ఉంటుందంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆవేదన చెందిన కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అయోధ్యలో రాముడు పేరుతో కొంతమంది దుర్మార్గులు దారుణంగా దోచుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా ఉందో మనకు తెలిసిందే కదా. ఈ పోస్టు అలా పెట్టగానే కొద్దిసేపటికే నెట్టింటా తెగ వైరల్ అయింది. ఇక ఇదే విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వద్దకు చేరింది. దీంతో అధికారులు సదర్ హోటల్ కు నోటీసులు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More