Tirumala Temple : చాలా రోజుల తర్వాత తిరుమల హుండీకి భారీ మొత్తంలో ఆదాయం…ఎంతో తెలిస్తే షేక్ అవాల్సిందే…

Tirumala Temple  : తిరుమల తిరుపతి శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత భారీ మొత్తంలో ఆదాయం వచ్చి పడింది. తాజాగా సోమవారం రోజు 64,882 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే…దాదాపు 5.28 కోట్ల రూపాయలు హుండికి వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. అలాగే 24,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో టైం స్లాట్ సర్వ దర్శనం టికెట్లేనివారికి దర్శనం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అయితే తిరుమల శ్రీవారికి దాదాపు రెండు మూడు నెలల నుండి రోజువారి ఆదాయం 5 కోట్లు దాటలేదు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం రోజు ఆ మార్క్ ను అధిగమించింది.

ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలలో అత్యంత ముఖ్యమైన ధనుర్మాసం సందర్భంగా 2023 డిసెంబర్ 17 నుండి 2024 జనవరి 14 వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి మటంలో తిరుప్పావై పారాయణం జరగనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కెల్వి అప్పన్ శతగోప రామానుజ పెద్ద జీయర్ స్వామి మఠంలో దాదాపు నెల రోజులపాటు ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేయడం జరుగుతుంది. ఇక ఈ పారాయన కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు చూపించనున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More