Viral Video : అవసరం అనేది సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుడుతుంది. ఇక అలాంటి సమయంలో మట్టి కూడా మాణిక్యం అవ్వాల్సిందే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు అందరికీ చేరుతున్నాయి. అయితే సృజనాత్మకంగా సృష్టించిన ఓ ఆవిష్కరణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. ఆ వీడియోను తన అమ్మగారు అతనికి పంపినట్లుగా ఐఏఎస్ అధికారి తెలియజేశాడు.
అయితే అవినీష్ శరణ్ షేర్ చేసిన వీడియో లో ఓ వ్యక్తి తన బైక్ పై ఒక మిషన్ ను అమర్చాడు. ఇక దాని సాయంతో పిండి పడుతున్నాడు. సాధారణ మిల్లుల మాదిరిగా బైక్ పైన యంత్రం లో శనగలు వేస్తే అది కాస్త పిండిలా కింద నుండి వచ్చేస్తుంది. బైక్ పై ఇంటికి వచ్చి పిండి పట్టడం చూసిన అవినీష్ తల్లి వీడియో తీసి దానిని అవినీష్ కు పంపించారట. ఇక ఈ వీడియో చూసిన అవినీష్ వ్యక్తి ఆలోచనకు ఫిధా అయి వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అద్భుతమైన ఆవిష్కరణ అంటూ ఆ వ్యక్తిని ప్రశంసించాడు.
దీంతో ఈ వీడియోని పోస్ట్ చేసిన ఒక్కరోజులోనే 3.8 లక్షలు మంది వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు , వ్యక్తి ఆలోచనను ప్రశంసిస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిభ కలిగి ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా భారత్ చర్యలు తీసుకోగలిగితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More