Viral Video : గ్రామాలు మరియు పట్టణాల్లో షేర్ ఆటోలను పరిశీలించారా… 7 లేదా 8 మంది కూర్చోవాల్సిన ఆటోలో అంతకుమించి జనాలను ఎక్కిస్తుంటారు. తప్పని పరిస్థితిలో చాలామంది అలానే ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇలా ప్రయాణించే వాళ్ళు ఎక్కువగా పేదవారు ఉంటారు. అయితే ఇవాళ ఒక కారు డ్రైవర్ తన కారు వెనుక భాగంలో డిక్కీని తీసేసి , దాని స్థానంలో ఇనుప సువ్వలతో చేసిన దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు . దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయానికి వస్తే.. డబ్బు కోసం ఎదుటివారిని ప్రాణాలను సైతం పణం గా పెట్టేవారు చాలామంది ఉంటారు.
గ్రామాలు పట్టణాల్లో షేర్ ఆటోలు, బస్సులలో పరిధికి మించి జనాలను ఎక్కించి తిప్పుతుంటారు. అయితే ఒక కార్ డ్రైవర్ అంతకుమించి ఆలోచించి ఒక చెత్త పని చేశాడు. అతని కారు వెనుక భాగంలో డిక్కీని తొలగించి దాని స్థానంలో ఇనుప సువ్వలను అడ్డు గా పెట్టి ఒక తలుపును సెట్ చేశాడు. ఇక అది చూడడానికి జంతువులను తీసుకెళ్లి బోన్ లా కనిపిస్తుంది. అయితే ఆ కారు వెనుక వెళ్తున్న కొందరు ప్రయాణికులకు ఇదంతా గమనించి వీడియో తీశారు. దారుణమేంటంటే ఆ కార్ డ్రైవర్ తయారు చేసిన డిక్కీ భాగం లోపల ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. ఆ ముగ్గురు పిల్లలలో ఒక పాప కూర్చున్న స్థానం నుండి లేచి తలుపులో నుండి బయటకు తలపెట్టి చూస్తుంది.
అయితే ఈ వీడియో పాకిస్తాన్లోని కరాచీ నుండి బయటకు వచ్చింది. ఇక ఈ వీడియోను mangobaaz అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నీటిజనులు డ్రైవర్ పై ఫైర్ అవుతున్నారు. పిల్లలకు అసలు సేఫ్టీనే లేదు అలా ఎలా తీసుకెళ్తున్నావ్ అంటూ మండిపడుతున్నారు.ఇలా తయారు చేయడానికి కనీస జ్ఞానం లేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే పిల్లల పరిస్థితి ఏంటి అంటూ డ్రైవర్ పై మండిపడుతున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More