Viral News : కొన్నిసార్లు కొంతమంది చేసే నిర్లక్ష్యం ఎదుటివారికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఇలాంటివి ఎక్కువగా ఆరోగ్య విషయంలో ఎదురవుతుంటాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వ మరియుప్రైవేటు ఆసుపత్రులలో రోగులకు ఇలాంటివి తప్పవు. దీనికి నిదర్శనంగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల మధురై కి చెందిన ఓ మహిళ విషయంలో ఇలాంటిదే ఒక సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా గర్భం దాల్చింది. జరిగిన విషయం తెలుసుకొని న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే…..
మధురై తూత్తుకుడి లో ఓ వ్యవసాయ దంపతులు ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. భర్త వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి ఆదాయం కూడా చాలా తక్కువ. అందువలన పిల్లల పోషణ భారంగా మారింది. దీంతో ఇద్దరు పిల్లలు చాలు అనే ఉదేశ్యం తో దంపతులిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో 2013లో తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె ఆపరేషన్ చేయించుకుంది. అయితే 2014లో ఆమె మరల గర్భం దాల్చింది. ఇక 2015లో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ గర్భవతిని ఎలా అయ్యానంటూ ఆమెకు అనుమానం వచ్చింది.
విచారించగా వైద్యుల నిర్లక్ష్యం వలన ఇలా జరిగిందని అమెకు తెలిసింది. దీంతో పరిహారం చెల్లించాలంటూ బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు పై సుదీర్ఘంగా విచారించిన మధురై కోర్టు ఇటీవల సంచలన తీర్పు వచ్చింది. బాధితురాలు మూడో బిడ్డ చదువు మరియు పై ఖర్చులు అన్నింటిని ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక పిల్లల పోషణ నిమిత్తం వారి కుటుంబానికి సంవత్సరానికి 1.20 లక్షలు లేదా మూడో సంతానం డిగ్రీ వయసు వచ్చేవరకు నెలకు పదివేలు చొప్పున అందించాలని కోరింది. దీంతో స్థానికంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More