Maldives : భారతదేశ ప్రధాని నరేంద్రర మోడీ ఇటీవల లక్షదీప్ పర్యటన చేసి దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత మాల్దీవు లకి చెందిన కొందరు అధికారులు కించపరిచేలా మాట్లాడడంతో భారత్ మరియ మల్దివు ల మధ్య విభేదాలు చోటుచేసుకున్న సంగతి అందరికీీ తెలిసిందే. మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీపై మరియు భారత్ పై జోకులు వేయడంతో చాలామంది భారతీయులు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకున్నారు. అంతేకాక బై కోట్ మాల్దీవ్ అనే నినాదంతో పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇక ఈ పరిణామం మల్దివులకి సంక్షోభాన్ని తెచ్చి పెట్టిందని చెప్పాలి. అయితే మల్దివులకి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. అది కూడా ఎక్కువ భారతీయుల వలన వస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయులు ఎవరు మాల్దీవులకు వెళ్లకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను టైమ్స్ ఆల్జీబ్రా పోస్టు ఆసక్తికరమైన సమాచారాలను వెల్లడించింది.
దీని ప్రకారం భారతీయులు మాల్దీవులను బహిష్కరించినట్లయితే ఆదేశానికి రోజుకు 9 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలియజేసేసింది. అలాగే తాజాగా బిగ్ న్యూస్ అందించిన రిపోర్ట్ ప్రకారం…భారతీయుడు మల్దివ్స్ కి వెళ్ళకుండా బహిష్కరిస్తే వారికి రోజుకు 9 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలియజేస్తుంది. భారతీయులు మాల్దివ్స్ బహిష్కరిస్తే 44 మాల్దీవుల కుటుంబాలు నష్టపోతాయని ట్రావెల్ ఏజెన్సీలు చెప్పుకొస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య విభేదాలు తర్వాత ఇప్పుడు భారతీయులందరూ ఎక్కువగా మాల్దీవులకు బదులు భారతీయ ధ్విప ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని టైమ్స్ ఆల్జీబ్రా ఎక్స్ లో , పోస్ట్ రాసింది. ఇక నిజం చెప్పాలంటే 300 కంటే ఎక్కువ చిన్న ద్వీపాల సమూహంతో కూడిన మాల్దీవులకు పర్యాటకం ముఖ్యమైన వనరుగా చెప్పుకోవాలి.
చైనా మినహా మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యటకులు వచ్చేది భారతదేశం నుండే . అందుకే భారతీయ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లడం మానేస్తే వారికి తీవ్ర నష్టం వాట్టిలుతుంది. ఇక ఒక్క రోజుకు 9 కోట్ల నష్టం అంటే మాల్దీవులు చేతిలో ఏడాదికి 3 నుండి 4 వేల కోట్ల ఆదాయం పోయినట్లే. అయితే అధ్యక్షుడు మొహమ్మద్ మాల్దీవు లోని పాలక పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ , భారత వ్యతిరేక చైనా అనుకూల విధానాన్ని కలిగి ఉంటుంది. ఇక అదే అజెండాతో మహమ్మద్ అక్కడ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించారు. నిజం చెప్పాలంటే అతను చైనా అనుకూల వైఖరిని అనుసరిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మాల్దీవుల్లో ఉన్న భారత ఆర్మీ యూనిట్లను ఆయన వెనక్కు వెళ్ళమని చెబుతూనే ఉన్నారు. ఈ విధంగా బహిరంగంగానే చైనా వైపు మోహిత్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More