Viral News : ఇటీవల ఓ యువకుడికి పెళ్లి కుదిరింది. తన పెళ్లికి రావాల్సిందిగా తన స్నేహితులందరినీ కోరాడు.అంతేగాక తన ప్రాణ స్నేహితులను ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు. స్నేహితుడు పిలవడంతో స్నేహితులంతా పెళ్లి రోజున మండపానికి చేరుకున్నారు. అయితే ముహూర్త సమయంలో పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన బంగారు నగలు కనిపించకుండా పోయాయి. ఎంత వెతికిన దొరకపోవడంతో కళ్యాణ మండపంలో అమర్చిన సిసిటీవీ కెమెరా లలో పరిశీలించారు .దీంతో అసలు విషయం బయటపడింది. పెళ్ళికొడుకు ప్రాణ స్నేహితుడే ఆనగలు కాజేసినట్లుగా తేలింది.
అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన విశాల్ శర్మా అనే యువకుడికి శివాని అనే అమ్మాయితో వివాహం కుదిరింది. తన వివాహానికిి అందరిని ఆహ్వానించాడు విశాల్. అయితే పెళ్లిలో వధువుకు ఇచ్చేందుకు రూ.8 లక్షల విలువైన నగలను విశాల్ చేయించినట్లు తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అతని ప్రాణ మిత్రుడు అభిషేక్ యాదవ్ చాకచక్యంగా ఆ నగలను ఎవరి కంటపడకుండా కొట్టేశాడు.
ముహూర్త సమయానికి నగలు బాక్స్ తెరచి చూడగా నగలు కనిపించలేదు. ఆ నగల కోసం పెళ్ళికొడుకు తరుపువాళ్ళు మరియు అతని స్నేహితులు కళ్యాణ మండపం అంతా వెతికారు. అయినా కనిపించకపోవడంతో కళ్యాణ మండపంలో అమర్చిన సిసిటీవీ ఫూటేజ్ ను తీసి పరిశీలించారు. దీంతో ఆ బాక్స్ లోని నగలను పెళ్ళికొడుకు ప్రాణ మిత్రుడు అభిషేక్ తీసినట్టు స్పష్టమైంది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More